నిబంధనలకు నీళ్లు.. పడవలపై ప్రాణాలు
ప్రయాణికుల రక్షణకు అమలు చేయాల్సిన నిబంధనలు పాటించకుండా అనధికారికంగా పడవలపై ఉప్పుటేరు దాటిస్తున్నా అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అనధికారికంగా రేవుల నిర్వహణ
పేరుపాలెంసౌత్ ఏటిపొర వద్ద పడవపై ఉప్పుటేరు దాటుతున్న ప్రయాణికులు
మొగల్తూరు, న్యూస్టుడే: ప్రయాణికుల రక్షణకు అమలు చేయాల్సిన నిబంధనలు పాటించకుండా అనధికారికంగా పడవలపై ఉప్పుటేరు దాటిస్తున్నా అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొగల్తూరు మండలం పేరుపాలెంసౌత్ దిబ్బలపల్లవపాలెం - ఎన్టీఆర్ జిల్లాలోని చినగొల్లపాలెంనేటిపొర గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరుపై పడవలతో ప్రయాణికులను అనధికారికంగా దాటిస్తున్నారు. సుమారు ఐదేళ్ల కిందట కచ్చులూరులో విహారయాత్రీకుల బోటు గోదావరిలో మునిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ప్రభుత్వం రేవుల నిర్వహణ నిబంధనలు కఠినతరం చేసింది. ప్రయాణికులను చేరవేసే బోటు, పడవల సామర్థ్యం, సరంగులకు లైసెన్స్ కలిగి ఉండటం తదితర నిబంధనలు విధించారు. అప్పటి వరకూ పేరుపాలెంసౌత్ - ఏటిపొర గ్రామాల మధ్య ఉప్పుటేరును పడవలపై దాటించి, రుసుము వసూలు చేసుకోవడానికి వేలం నిర్వహించేవారు. ఆ సమయంలో దీని ద్వారా పంచాయతీకి రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఆదాయం సమకూరేది. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం అర్హులు రాకపోవడంతో అప్పటి నుంచి గ్రామ పంచాయతీ వేలంపాట నిలిపివేసింది. దీంతో పంచాయతీ ఆదాయానికి గండిపడింది. రెండేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అనధికారికంగా ప్రజారవాణాకు పడవలను వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతం సముద్ర ముఖద్వారానికి దగ్గరగా ఉండటం, సముద్ర ఆటుపోటుల ప్రభావంతో పలు సందర్భాల్లో ఉప్పుటేరు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. నిర్వాహకులు ద్విచక్ర వాహనానికి రూ.30లు, ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10లు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రక్షణకు లైఫ్జాకెట్లు వంటివి వినియోగించకుండా అనధికారికంగా రవాణా చేస్తున్నారు. సమస్యను ‘న్యూస్టుడే’ పంచాయతీల విస్తరణాధికారి మేడిద నవీన్కిరణ్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాబందులే నయం.. పీక్కు తినడమే ఈ నేతల పని!
[ 10-05-2024]
వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. -
జగన్ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు
[ 10-05-2024]
‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. -
ఉద్యోగాలేవి జగన్
[ 10-05-2024]
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. -
నేడు ఉండిలో ప్రజాగళం సభ
[ 10-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు. -
కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు
[ 10-05-2024]
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
చివరి అస్త్రాలకు పదును
[ 10-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
తాయిలాల పంపిణీ లేకుండా నిఘా : కలెక్టర్
[ 10-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం
[ 10-05-2024]
నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. -
జగన్ గారడీ..బీఎల్వోలకు బురిడీ!
[ 10-05-2024]
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు. -
మూడు రోజుల్లో సైకో పాలనకు చరమగీతం
[ 10-05-2024]
అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు: దేవినేని
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
గుక్కెడు నీటికీ యాతనే!
[ 10-05-2024]
ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. -
అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ
[ 10-05-2024]
అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
11న సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు
[ 10-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..