Eluru: మా అక్క నరకం చూసింది.. ఫ్రాన్సిక సోదరి ఆవేదన
ఏలూరులో జరిగిన యాసిడ్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఫ్రాన్సిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దెందులూరులో బుధవారం నిర్వహించారు.
హడావుడిగా శవపరీక్ష.. బందోబస్తు నడుమ అంత్యక్రియలా?
పోలీసుల తీరుపై చింతమనేని అసహనం
ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది. మంగళవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మాట్లాడటంతో మేం చాలా ఆనందపడ్డాం త్వరలో కోలుకుం టుందని ఆశపడ్డాం. రాత్రి 12.30 గంటలకు చనిపోయినట్లు డాక్టర్ చెప్పడంతో కన్నీరు ఆగలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాసిడ్ దాడితో ఊపిరితిత్తులు మొత్తం కాలిపోయాయి. ఓ కన్ను కూడా పోయింది.
సుహాసిని, ఫ్రాన్సిక చెల్లెలు
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్
దెందులూరు, ఏలూరు, టూటౌన్, న్యూస్టుడే: ఏలూరులో జరిగిన యాసిడ్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఫ్రాన్సిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దెందులూరులో బుధవారం నిర్వహించారు. పోలీసుల బందోబస్తు నడుమ మృతదేహం ఉన్న వాహనాన్ని శ్మశానానికి తరలించారు. మృతురాలి భర్త ఆంజనేయులు వచ్చేంతవరకు ఆపాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ వాహనానికి అడ్డు నిలవడంతో పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో వారితో వాగ్వాదానికి దిగారు. మృతురాలి బంధువులు ఆమె భర్తకు ఫోన్ చేయగా తాడేపల్లిగూడెంలో ఉన్నానని వస్తున్నానని అతడు చెప్పాడు. కొంత సమయం వేచి చూసిన తర్వాత భర్త రాకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సీఐ దుర్గాప్రసాద్తో పాటు నలుగురు ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.
శాంతిభద్రతలు క్షీణించాయి.. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. అర్ధరాత్రి హడావుడిగా పోస్టుమార్టం, పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. భర్త వస్తున్నాడని చెప్పినా కడసారి చూపునకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేయించే పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. అధికారులంతా ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని, మృతురాలి కుమార్తెను ప్రభుత్వమే దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఫ్రాన్సిక కుమార్తె ఆరేళ్ల స్మైలీని ప్రభుత్వమే ఆదుకోవాలని.. మృతురాలి తల్లిదండ్రులు సౌలురాజు, ధనలక్ష్మి కోరారు. తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్న నిందితులకు కఠిన శిక్షలు పడాలన్నారు. కన్నబిడ్డ చనిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామన్నారు.
ఉదయాన్నే పోస్టుమార్టం
గుంటూరు జీజీహెచ్ శవాగారం వద్ద మోహరించిన పోలీసులు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: ఫ్రాన్సిక మృతదేహాన్ని బుధవారం ఉదయమే తాడేపల్లి ఆస్పత్రి నుంచి గుంటూరు సర్వజనాసుపత్రి శవాగారానికి తరలించారు. అప్పటికే వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. శవపంచనామా నివేదిక తయారీ, శవపరీక్షలను 8.30 గంటలకే పూర్తి చేశారు. వెంటనే బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని తరలించారు. వాస్తవానికి శవాగారానికి ఉదయం 9 గంటలకు వైద్యులు విధులకు వస్తుంటారు. ముందస్తు సమాచారంతోనే అవసరమైన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా చేయడం గమనార్హం. శవాగారం వద్ద పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రొయ్యకు ‘జగన్ వైరస్’
[ 09-05-2024]
రొయ్యల పంటకు వైరస్ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి. -
ఇదేనా మహిళా సాధికారత.. జగన్
[ 09-05-2024]
మహిళల్లో మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం -
సీసాలో భూతం
[ 09-05-2024]
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. -
కొల్లేరు రాజ్యంలో అరాచకాసురుడు
[ 09-05-2024]
అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం. -
జనసేనానికి నీరాజనం
[ 09-05-2024]
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. -
మీ పాలనలో రోజూ అమావాస్యే
[ 09-05-2024]
జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి. -
ఖాకీలపై కాఠిన్యం
[ 09-05-2024]
నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు. -
మీ వెంకీ మామగా కోరుతున్నా
[ 09-05-2024]
కైకలూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈ నెల 13వ తేదీన ప్రజలంతా బాధ్యతాయుతంగా కామినేని శీను మావయ్యకు ఓటేసి గెలిపించాలని ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. -
బీమాలోనూ జగన్మాయ
[ 09-05-2024]
యజమాని ఆకస్మిక మరణంతో ఆదరవు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన్న బీమాపై జగన్ ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. -
త్వరలోనే టిడ్కో గృహాలు కేటాయిస్తాం
[ 09-05-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి పూర్వ వైభవం తీసుకొస్తాుని ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వô్మ పేర్కొన్నారు. -
‘ప్రజల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర’
[ 09-05-2024]
ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారని తెదేపా సీనియర్ నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు, -
పోలింగ్ కేంద్రానికి పచ్చ రంగు
[ 09-05-2024]
కట్టా సుబ్బారావుతోటలో పోలింగ్ కేంద్రానికి (సామాజిక భవనం) అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు.
తాజా వార్తలు (Latest News)
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్