దిక్కులేని ప్రాజెక్టులు
గ్రీజు పెట్టే దిక్కు లేదు. ఏటా ప్రతిపాదనలే తప్ప బాగు చేసే చర్యలు లేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రతిపాదనలే తప్ప సొమ్ములకు గతి లేదు
నిర్వహణను గాలికొదిలిన ప్రభుత్వం
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే
గ్రీజు పెట్టే దిక్కు లేదు. ఏటా ప్రతిపాదనలే తప్ప బాగు చేసే చర్యలు లేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నీటి నిల్వలతో తొణికిసలాడాల్సిన ప్రాజెక్టులు మరమ్మతులు జరగక ఓటి కుండల్లా తయారయ్యాయి. దీంతో భద్రత ఉండదన్న భయంతో రిజర్వాయర్లను నీళ్లు లేకుండా ఖాళీ చేసేస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో ఎర్రకాలువ, తమ్మిలేరు, కొవ్వాడ, జల్లేరు తదితర ప్రాజెక్టుల నిర్వహణ లేమితో కునారిల్లుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు, రోప్లకు అవసరమైన గ్రీజుకు కూడా రూపాయి లేని స్థితి నెలకొంది.
కత్తి మీద సాములా.. ఏటా వర్షాల సీజన్లో ప్రాజెక్టుల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. దినదిన గండంగా అధికారులు నెట్టుకొస్తున్నారు. నింపితే ఎక్కడ గేట్లు దెబ్బతింటాయో, పటిష్ఠత లేని గట్లకు ఎక్కడ గండ్లు పడతాయోనన్న భయంలో జలవనరుల శాఖ ఉంది. నీటిని వృథాగా వదిలేస్తే పంటలకు నష్టం. అలాగని నింపితే కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో రైతుల్లోనూ అభద్రతా భావం గూడుకట్టుకుంది. 2023 జులైలో వరదలకు ఎర్రకాలువలో గేట్లు పట్టేసి దిగకుండా ఆగిపోవడంతో..తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు కిందకు దించి ఊపిరి పీల్చుకున్నారు. పొరుగు సేవల్లో పనిచేస్తున్న లస్కర్లకు రెండేళ్లుగా జీతాలు విడుదల కావట్లేదంటే నిర్వహణపై ఏ పాటి శ్రద్ధ ఉందో తెలుస్తోంది.
ఎర్రకాలువ.. సగమే ప్రయోజనం
నిర్వహణకు రూ.1.06 కోట్లు ప్రతిపాదిస్తే రూ.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో 2023 ఆగస్టులో స్పిల్వే రెగ్యులేటర్తోపాటు కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో పాడైన షట్టర్లు, గేట్లు తొలగించి కొత్తవి అమర్చారు. అయితే గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. 32 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సినప్పటికీ నిర్వహణలోపంతో 16 వేల ఎకరాలకే విడుదల చేస్తున్నారు. సాగునీరే కాదు ఇది దిగువన ఉన్న పలు గ్రామాలకు వరద నివారణ ప్రాజెక్టు కూడా. అయితే వర్షాకాలంలో వరద నివారణ నుంచి ఈ గ్రామాలను, చేలను కాపాడకపోగా ఇదే ముంచెత్తుతుండటం గమనార్హం.
కొవ్వాడకు కావాలి తక్షణ చికిత్స
ఈ రిజర్వాయరుకు ఉన్న మూడు గేట్లూ సమస్యగానే ఉన్నాయి. తక్షణ మరమ్మతులు అవసరం. ప్రాజెక్టు నిర్వహణకు గడచిన అయిదేళ్లలో సుమారు రూ.45 లక్షలకు ప్రతిపాదనలు పంపించారు. సిబ్బంది జీతాలు మినహా నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విడుదలైన దాఖలాలు లేవు. ఈ రిజర్వాయరు ద్వారా సుమారు 17వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉండగా 14 వేల ఎకరాలకే అందుతోంది.
జల్లేరుకు పడని టెండర్లు
దొరమామిడి సమీపంలోని ఈ ప్రాజెక్టుకు రెండు గేట్లు ఉన్నాయి. వీటి మరమ్మతులతోపాటు నిర్వహణ వ్యయం రూ.26 లక్షలు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాలేదు.ఏటా నవంబరులో క్రమం తప్పకుండా నిర్వహణ వ్యయం కోసం ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. రబీలో సుమారు 3 వేల ఎకరాలకు దీని ద్వారా నీరు అందుతుంది.
తమ్మిలేరుకు సున్నా
గత అయిదేళ్లలో దీనికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. గేట్ల మరమ్మతులు, రోప్, వైర్లు, జనరేటర్, విద్యుత్తు ప్యానళ్లు తదితరాల కోసం రూ.50 లక్షలు ప్రతిపాదించారు. ఏటా సుమారు రూ.10 లక్షలు చొప్పున ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తాడేపల్లిగూడెంలో జనసేనాని సభ
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్ వద్ద జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. -
జిల్లా ఓటర్లు 16,37,430
[ 28-04-2024]
జిల్లాలో ఇప్పటి వరకు 16,37,430 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 7,99,241 మంది, మహిళలు 8,38,063, ఇతరులు 126 మంది ఉన్నారు. -
జగన్ ఏలుబడి.. బాగుపడని బాలబడి!
[ 28-04-2024]
ఒక్కటంటే ఒక కేంద్రం బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది. వారికి మావయ్యనంటూ సీఎం జగన్ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే. -
కాలయాపన చేసి అప్పుల్లో ముంచారు
[ 28-04-2024]
సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఈ లబ్ధిదారులకు నేటికీ బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. -
వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు
[ 28-04-2024]
వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. -
జగనన్నా... అన్నింటికీ ఎగనామమే!
[ 28-04-2024]
మాది రైతు ప్రభుత్వం.. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ఆర్బీకేల ద్వారా రైతుపరమైన కార్యకలాపాలతో సమూల మార్పులకు నాంది పలికాం.. సీఎం జగన్మోహన్రెడ్డి మాటలివి. -
వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు : చింతమనేని
[ 28-04-2024]
వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. -
అధికార పార్టీ ప్రలోభాల పర్వం
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. -
దొరికినకాడికి దోచుకోవడమే!
[ 28-04-2024]
ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు. -
పశ్చిమ ఓటర్లు 14,72,923
[ 28-04-2024]
పశ్చిమ గోదావరిలో ఓటర్ల సంఖ్య 14,72,923కు చేరింది. సవరణల అనంతరం గత జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 14,61,338 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రజల పక్షాన పోరాడితే 25 కేసులు పెట్టారు: నిమ్మల
[ 28-04-2024]
జగన్ ప్రభుత్వంలో ప్రజల పక్షాన సమస్యలపై పోరాడినందుకు తనపై 25 కేసులు పెట్టారని, కక్షసాధింపునకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
విలీనం..బతుకు ‘చక్ర’బంధం!
[ 28-04-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ కష్టాలు తీరి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు అందుతాయని ఆశ పడ్డారు ఆర్టీసీ సిబ్బంది. -
మూడేళ్లూ మందగమనమే
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థలను నామమాత్రంగా మార్చేసింది. రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలకూ సంకెళ్లు వేసింది. ఫలితంగా మూడున్నర సంవత్సరాల్లోనే జడ్పీ, ఇతర స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
జగన్ అరాచక పాలనపై ఎన్డీయే తరఫున ఛార్జిషీట్ వేస్తాం: పితాని
[ 28-04-2024]
అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.