పర్యాటక క్షోభ
ప్రపంచ పర్యాటక మ్యాప్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో కనిపించాలి. దానికి తగ్గ కొత్త పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తోంది.
అగ్రస్థానం తెస్తామంటూ జగన్నాటకం
ఉమ్మడి జిల్లాలో వనరులన్నీ నీరుగార్చిన వైనం
ఎప్పటికి వినియోగంలోకి పెదమల్లంలోని పర్యాటకశాఖ భవనాలు
యలమంచిలి, ఆచంట, న్యూస్టుడే: ప్రపంచ పర్యాటక మ్యాప్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో కనిపించాలి. దానికి తగ్గ కొత్త పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తోంది. పర్యాటకంగా అవకాశమున్న ప్రతి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతుంది.
గత ఆగస్టు 18న విజయవాడలో జరిగిన ఒక హోటల్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ అన్నమాటలివి.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు అగ్రస్థానం మాట దేవుడికెరుక. ఆఖరి స్థానంలో పడుతూ లేస్తూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దుస్థితికి ఉమ్మడి జిల్లాలో పర్యాటకం చేరింది. ప్రకృతి పరవశించే అందాలతో చారిత్రక ప్రాంతాలు నిండుగా ఉన్న ఉమ్మడి జిల్లాలో పర్యాటకాన్ని వైకాపా సర్కారు వచ్చాక పూర్తిగా విస్మరించింది. అరకొర ప్రతిపాదనలు తప్ప జరిగిన అభివృద్ధి ఇసుమంతైనా లేదు.
ఉమ్మడి జిల్లాకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నారు. విదేశీయులు మన దేశానికి వస్తే రోజుకు రూ.లక్షల్లో వెచ్చిస్తుంటారనేది తెలియనిది కాదు. రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం లభించే అతి తక్కువ అవకాశాల్లో పర్యాటకం ఒకటి. ఇది ఎంతటి విలువైనదో ప్రభుత్వానికి తెలియందేమీకాదు. అయినా అయిదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయామనేది జగనెరిగిన సత్యమే.
ఉన్నవాటిని వదిలేశారుగా.. తెదేపా హయాంలో గోదావరి తీరాన భూములున్న రైతులతో ఒప్పందం చేసుకుని లీజు పద్ధతిలో పర్యాటకాన్ని నది పొడవునా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు చేస్తే వైకాపా పాలనలో ఉన్నవాటినే వదిలేశారు. జాతీయ రహదారి పక్కన పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో ఉన్న రిసార్టులను ప్రైవేటు నిర్వహణకు అప్పగించడమే ఉదాహరణ. ఆచంట మండలం పెదమల్లంలో నిర్మించిన రిసార్టులకు కనీసం రహదారి కూడా వేయనంత నిర్లక్ష్యంతో రూ.కోట్లు పెట్టుబడిగా పెట్టిన ప్రజాధనం వృథాగా మారిపోయింది. తెదేపా ప్రభుత్వం ఇక్కడ రిసార్ట్స్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు చేసింది. అతిథుల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అయిదేళ్లపాటు నిరుపయోగంగా వదిలేసింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరును అభివృద్ధి చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గుర్తించిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చేసిన ప్రతిపాదనలను పట్టించుకుని కేంద్ర నిధులు తీసుకురాగలిగారా అంటే అదీ లేదు. ఇవ్వనప్పుడు ఎన్ని ప్రతిపాదనలు చేసి ఏం లాభం. ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అధికారులు రెండేళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. అవైనా ఇచ్చి ఉంటే వెంటిలేటర్ మీదున్న పర్యాటకానికి ఊపిరాడేది. పర్యాటకం ఉసూరుమనడంతో యువత ఉపాధి కోల్పోయింది. పచ్చదనంలో కేరళతో, సముద్ర తీరాన గోవాతో పోటీపడే అందాలు కోకొల్లలుగా ఉన్నా పర్యాటకులకు కావాల్సిన వసతులు, అభివృద్ధి జరగక వెనుకబడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఇవా మెరున వైద్య సేవలు?
[ 30-04-2024]
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. -
జనసేన అభ్యర్థులు లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. -
మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
ప్రజల ఆస్తుల స్వాహాకు జగన్ కుట్ర
[ 30-04-2024]
ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అభివృద్ధి కావాలా.. జూద శిబిరాలు కావాలా
[ 30-04-2024]
సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్ గణపవరం మహాలక్ష్మి థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. -
యంత్రాంగం ఉండీ.. ఎందుకీ మంత్రాంగం?
[ 30-04-2024]
ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడింది. మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది. -
నూజివీడు కూటమిలో జోష్
[ 30-04-2024]
నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. -
నిర్వాసితులను నిలువునా ముంచారు
[ 30-04-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
ఎన్నికల బరిలో 99 మంది
[ 30-04-2024]
జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది. -
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు వీరే
[ 30-04-2024]
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. -
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని వేధిస్తారా?
[ 30-04-2024]
కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఆగని ఇసుక దందా
[ 30-04-2024]
ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు