సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది.
అధికార పార్టీ నాయకుల అండదండలతో గుత్తేదారుల దోపిడీ
ముదినేపల్లి, న్యూస్టుడే: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. ఇళ్ల నిర్మాణం చేసుకోలేని లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని అధికార పార్టీకి చెందిన వారి అండదండలు ఉన్న గుత్తేదారులు రూ.లక్షలు దోచుకోగా, లబ్ధిదారులు మాత్రం అటు పక్కా ఇల్లు రాక, ఇటు అద్దెలు, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం కోసం అప్పులు చేసి గుత్తేదారులకు ఇచ్చి అవి తిరిగి రాక ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతున్న లబ్ధిదారుల సంఖ్య వేలల్లో ఉంది. ఒక్క ముదినేపల్లి మండలంలోనే సుమారు 60 నుంచి 80 మంది లబ్ధిదారులు గుత్తేదారులకు సొమ్ములిచ్చి నట్టేట మునిగారు. ముదినేపల్లి, గురజ, వడాలి, ఊటుకూరు, వాడవల్లి, వణుదుర్రు పలు గ్రామాల్లో ఇలా నష్టపోయిన వారు అధికంగా ఉన్నారు. నిర్మాణం ప్రారంభించకుండానే పలువురి నుంచి రూ.60 వేలు నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్గా తీసుకుని నిర్మాణం చేయలేదు.
అధికారుల సహకారం.. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా బిల్లులు చేయని వారు గుత్తేదారులు రాగానే కనీసం బేస్మెంట్ వేయకుండానే అధికారులు బిల్లులు చేయడం గమనార్హం. గృహ నిర్మాణ సంస్థ ఏఈ బిల్లు పెట్టాలంటే రూ.2 వేలు ఇవ్వాలని, ఇసుక బిల్లు కావాలంటే ఇంత నగదు అంటూ సచివాలయ సిబ్బంది వసూలు చేశారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ‘ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేసేందుకు యత్నిస్తున్నాం’ అని గృహ నిర్మాణ సంస్థ ఏఈ శేషగిరిరావు తెలిపారు. సమగ్ర విచారణ చేసి ఇందులో సచివాలయ ఉద్యోగుల ప్రమేయం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో మురళీగంగాధరరావు తెలిపారు.
‘ఇట్లు నిర్మిస్తామంటూ సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంటు ఓ గుత్తేదారుని తీసుకు వచ్చి బాధ్యత నాది అంటూ రూ.40 వేలు ఇప్పించారు. కాంట్రాక్టు ఇవ్వగానే బిల్లు పడింది. అందులో మరో రూ.20వేలు గుత్తేదారుకు ఇప్పించారు. నాసిరకంగా బేస్మెంట్ వేసి అది తొలగించారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధిని, పోలీసులను ఆశ్రయించా. కైకలూరు సీఐ దగ్గరకు వెళ్లమన్నారు. వెళ్లగా నా మెటీరియల్, నగదు ఇచ్చేస్తానని గుత్తేదారు రాసి రూ.60వేలు చెక్కు ఇచ్చాడు. బ్యాంక్కు వెళ్తే అది బౌన్స్ అయింది. ఆ తర్వాత మా గురించి పట్టించుకున్నవారు లేరు. తెచ్చిన అప్పునకు వడ్డీ పెరుగుతోంది. అద్దె సైతం చెల్లించుకోలేకపోతున్నా.’
-ఉమ్మడిశెట్టి కుమారి, వాడవల్లి
‘సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంటు కాంట్రాక్టరును తీసుకువచ్చి అతనికి నగదు ఇస్తే నిర్మించి ఇస్తాడని నమ్మ బలికారు. రూ.20వేలు అప్పు చేసి ఇచ్చాం. ఆ తర్వాత నాసిరకంగా పని ప్రారంభించి వెళ్లిపోయాడు. పోలీసులను ఆశ్రయిస్తే చెక్కు ఇచ్చాడు. బ్యాంక్కు వెళ్తే చెక్బౌన్స్ అయింది. ఎన్నిసార్లు సచివాలయానికి వెళ్లినా కాంట్రాక్టరు పారిపోతే మేమేం చేయమంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.’
- కె.రమాదేవి, వాడవల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాలనలో.. శ్రామిక హక్కులకు సంకెళ్లు!
[ 01-05-2024]
ఒక్క అవకాశం ఇస్తే మీ జీవితాలు మార్చేస్తానంటూ గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రామికులను నిలువునా ముంచేశారు. ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోగా హక్కులపై గళమెత్తిన కార్మిక నేతలపై జగన్ సర్కారు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది. -
వైకాపాను సాగనంపుదాం..
[ 01-05-2024]
ఎన్డీయే కూటమి శ్రేణుల్లో తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
కూటమి ప్రభుత్వంలో ‘పోలవరం జిల్లా’
[ 01-05-2024]
పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటారా?
[ 01-05-2024]
అధికార వైకాపా పింఛనుదారులతో రాజకీయ జూదం ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా సునాయాసంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నా ససేమిరా అంటూ లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. -
నచ్చకుంటే బదిలీ.. లేదా బలి
[ 01-05-2024]
నచ్చి, వారి అడుగులకు మడుగులొత్తే అందలమెక్కించడం...నచ్చకపోతే నరకం చూపించటం వైకాపా పాలనలో అనవాయితీగా మారింది. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించటం.. డిప్యుటేషన్పై దూరంగా విసిరేయటంతో గత అయిదేళ్లలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక పరిశీలకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్మిశ్రా అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు శైలేష్కుమార్ సిన్హా, -
కరెంటు లేక కష్టాలు
[ 01-05-2024]
అసలే ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలవరం ప్రజలు సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. జగన్నాథపేట వద్ద పరివర్తకంలో సమస్యతోపాటు పలు చోట్ల తీగలు తెగిపోవడంతో జగన్నాథపేట, -
‘అసమర్థ సీఎం.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దాం’
[ 01-05-2024]
వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అసమర్థ ముఖ్యమంత్రి.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దామని ఎన్డీయే నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, -
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం
[ 01-05-2024]
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్ అన్యాయం చేశారన్నారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
[ 01-05-2024]
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. -
కక్ష రాజకీయాలు మనకొద్దు
[ 01-05-2024]
అభివృద్ధి అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండటమే అని.. తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే ఇది సాధ్యమని భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. -
కదిలిన కొలువుల గుట్టు
[ 01-05-2024]
వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు. -
5 వరకు సాగునీటి విడుదల
[ 01-05-2024]
డెల్టాలో పంట కాలువలకు మే 5వ తేదీ వరకు నీటి సరఫరా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తాగునీటి వనరులతో పాటు ఆక్వా చెరువులను యుద్ధప్రాతిపదికన నింపుకొనేందుకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
నియమావళి పాటించాల్సిందే
[ 01-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా నియమావళిని కచ్చితంగా పాటించి తీరాలని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు