గ్రామపంచాయతీలకు మళ్లీ షాక్!
వైకాపా ప్రభుత్వానికి నిధుల దాహం తీరడంలేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులను విద్యుత్తు బకాయిలకు చెల్లించాలనే ఒత్తిళ్లు పెరిగాయి.
15వ ఆర్థిక సంఘం తాజా నిధులకు షరతులు
విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు
ఈనాడు డిజిటల్, కడప
వైకాపా ప్రభుత్వానికి నిధుల దాహం తీరడంలేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులను విద్యుత్తు బకాయిలకు చెల్లించాలనే ఒత్తిళ్లు పెరిగాయి. ఇది వరకు ప్రభుత్వమే రెండు సార్లు గుట్టుచప్పుడు కాకుండా నిధులను మళ్లించుకుపోగా... విమర్శలకు జడిసి ఈ సారి ఆ పని సర్పంచుల చేతులమీదుగానే బలవంతంగా చేపట్టే ఎత్తుగడ వేసింది.
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసినా వీటిలో చాలా వరకూ విద్యుత్తు బకాయిల కింద వెళ్లిపోనున్నాయి. ఈ మేరకు ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు జిల్లా అధికారులపై ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా ప్రభుత్వమే స్వయంగా మళ్లించి విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్కు సర్దుబాటు చేసింది. పన్నుల ఆదాయం అంతంత మాత్రంగా ఉండే పంచాయతీలకు ప్రధాన ఆధారమైన ఆర్థిక సంఘం నిధుల ఖాతాలు ఖాళీ కావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి నుంచి చాలా పంచాయతీలు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. చాలా మంది సర్పంచులు సొంత నిధులు.. అప్పులు చేసి కనీస అవసరాలను తీరుస్తున్నారు.
* కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను తాజాగా కేటాయించింది. వీటిని వినియోగించుకోవచ్చుననే ఎంతో ఆశతో సర్పంచులు ఎదురుచూశారు. పంచాయతీలు కొత్తగా పీడీ ఖాతాల స్థానంలో బ్యాంకుల్లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంఎస్) ఖతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో జమ చేసిన పక్షంలో నిధులపై పూర్తిగా హక్కులు సర్పంచులకే ఉంటాయి. పీడీ ఖాతాల్లోనే జమ కావడంతో సర్పంచులకు మింగుడు పడడంలేదు. నిధులొచ్చిన విషయం తెలిసి విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ రంగంలోకి దిగింది. వైయస్ఆర్ జిల్లాలో రూ.254.24 కోట్లు, అన్నమయ్యలో రూ.301.19 కోట్లు బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలని ఒత్తిడి తేవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు సహకరిస్తోంది.
* అటు అన్నమయ్య.. ఇటు వైయస్ఆర్ జిల్లాల్లో 90 శాతం వరకు సర్పంచులు వైకాపాకు చెందిన వారే ఉన్నారు. మూడోసారి కూడా కేంద్రం నిధులను విద్యుత్తు బకాయిలకు మళ్లించాలనే ప్రభుత్వ ఆదేశాలను దాదాపు అందరూ వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే తాము చేపట్టిన పనులకు బిల్లులు పెట్టడానికి సిద్ధమై ట్రెజరీలకు పంపారు. కొన్ని పంచాయతీల నుంచి ఏకంగా సీఎఫ్ఎంఎస్కు బిల్లులు పెట్టుకున్నారు. ప్రభుత్వ జీవోలను లెక్క చేయకుండా బిల్లులు కింద జమ చేస్తున్నారు. వైయస్ఆర్ జిల్లాలో మాత్రం రూ.80 లక్షలు వరకు విద్యుత్తు బకాయిలు చెల్లించారు. ఈ తీరును సొంత పార్టీ సర్పంచులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రూ.78 లక్షల బకాయిలు ఇప్పటికే చెల్లింపు
-ప్రభాకర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, వైయస్ఆర్ జిల్లా
15వ ఆర్థిక సంఘం కింద విడుదలైన అన్టైడ్ కింద 40 శాతం నిధులను విద్యుత్తు బకాయిల కింద చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇప్పటికే రూ.78 లక్షల బకాయిలు చెల్లించారు. టైడ్ కింద పారిశుద్ధ్యం, జీతాలు తదితర వ్యయాలకు చెల్లించుకోవచ్చు.
అధికారుల నుంచి ఒత్తిళ్లు
-యనమల సుధాకర్, సర్పంచి, పోరుమామిళ్ల
అన్టైడ్ కింద వచ్చిన నిధులను 40 శాతం వరకు విద్యుత్తు బకాయిల కింద చెల్లించాం. ఈ మేరకు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి రాగా చెల్లించాల్సి వచ్చింది. మేము సొంత నిధులు వెచ్చించిన పనులకు మాత్రం నెలల తరబడి బిల్లులు చెల్లించడంలేదు.
తేలని నిధుల వ్యవహారం
-ఎం.నాగరాజు, సర్పంచి, కె.దొడ్డిపల్లె, కలకడ
గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఎంత వచ్చాయి... ఏ మేరకు మళ్లించుకుపోయారనే విషయం బయటకు రాలేదు. దీంతో విద్యుత్తు బకాయిల విషయం తేలడంలేదు. బకాయిలు చెల్లించడానికి ఏకకాల పరిష్కార పథకం(ఓటీఎస్) మినహాయింపును వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనారిటీలతో మాజీ ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం
[ 05-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. -
తెదేపాలో చేరిన 40 కుటుంబాలు
[ 05-05-2024]
మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. -
నేడు అంగళ్లుకు చంద్రబాబు రాక
[ 05-05-2024]
తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లుకు ఆదివారం రానున్నారు. ఇక్కడ జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. -
ఆకేపాటి ఓ కబ్జాకోరు!
[ 05-05-2024]
‘అరాచక వైకాపా ప్రభుత్వం పోవాలంటే కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను గెలిపించండి. -
పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం!
[ 05-05-2024]
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు. -
కడపలో వైకాపా అరాచకం
[ 05-05-2024]
కడప నగరంలో వైకాపా అరాచకాలు ముదిరి పాకానపడుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నగరంలోని 41వ డివిజన్లో శనివారం తెదేపా ప్రచారాన్ని డిప్యూటీ మేయర్ భర్త జమాల్తో పాటు పలువురు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. -
ఐదేళ్లు గాడిదలు కాశారా?
[ 05-05-2024]
‘కడప ఉక్కు ఊసే లేదు. తట్టెడు మట్టి ఎత్తలేదు, ఇటుక పేర్చలేదు.. పోలవరం ప్రస్తావన అసల్లేదు.. వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. తగుదనమ్మా అంటూ ఇప్పుడు దగా డీఎస్సీ ప్రకటించారు.. వైకాపా ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఏం చేశారు. -
రెండు సార్లు వచ్చావ్... ఉక్కుకేమి చేశావ్?
[ 05-05-2024]
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. -
కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాను...
[ 05-05-2024]
‘సీమ కష్టాలు చూశాను.. సీమ కన్నీళ్లు తుడుస్తాను. యువత నుంచి వచ్చిన పిలుపు మేరకు యువగళం మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించి కడప వరకు 119 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాను. -
ఎన్డీఏ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 05-05-2024]
రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్సభ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన రామాంజుల్రెడ్డి, హనుమంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటయ్య, నాగయ్య, ఓబులరెడ్డి, సుబ్బరాయుడు, సీమాన్, అజరయ్య, వీరాంజనేయరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరారు. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు!
[ 05-05-2024]
ఓటు విలువ అమూల్యం. ప్రజాస్వామ్యానికి అదే ప్రాణం. పౌరుడికే అదే వజ్రాయుధం. అలాంటి ఓటును రాజకీయ నాయకులు రకరకాల ప్రలోభాలు, డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 05-05-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె డాక్టరు సునీత పేర్కొన్నారు. -
వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశం
[ 05-05-2024]
రాయచోటిలోని పురపాలక సభా భవనం వద్ద శనివారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సగీర్పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సభా భవనంలో ఛైర్మన్ ఎస్.ఫయాజ్బాషా మరికొంత మంది కౌన్సిలర్లు గత నెలలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. -
ఏడాది అన్నావ్... ఎడారి చేశావ్...!
[ 05-05-2024]
‘అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరదలకు తెగిపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. రాజంపేట నియోజకవర్గానికి సాగు, తాగునీరందిస్తున్న జలాశయాన్ని ఏడాదిలోనే మరో ఏడు టీఎంసీˆలు నీరు నిల్వ ఉండే విధంగా పునర్నిర్మిస్తాం’ అని జలాశయం కట్ట తెగిన సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. -
మిథున్రెడ్డి జగత్ కంత్రీ... నల్లారి గెలిస్తే కేంద్ర మంత్రి
[ 05-05-2024]
రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్కుమార్రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్రెడ్డిని గెలిపిస్తే జగత్కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..