ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణం
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న కుర్రిరేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
రేఖ (పాత చిత్రం)
వేంపల్లె, న్యూస్టుడే : ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న కుర్రిరేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమెకు కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థులు, ట్రిపుల్ఐటీ సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం ట్రిపుల్ఐటీలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందారు. ఇంజినీరింగ్కోర్సు పూర్తిఅయ్యింది. మరో పదిరోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ఐటీ డైరెక్టర్ కుమారస్వామిగుప్త, హాస్టల్ సంక్షేమాధికారి ఇమ్రాన్షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు విద్యార్థిని చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
యువకుడిపై హత్యాయత్నం... ఒకరి అరెస్టు
కడప నేరవార్తలు, న్యూస్టుడే: కడప తాలూకా ఠాణా పరిధిలో ఆలంఖాన్పల్లె రాణితోపు వద్ద ఓ యువకుడిపై కొంతమంది మద్యం సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడితో పాటు అతని సోదరుడు, తల్లిదండ్రులకు గాయాలైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. గ్రామానికి చెందిన వంశీకృష్ణ, అదే ప్రాంతానికి చెందిన వెంకీల మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న వెంకీ తన స్నేహితుడైన సురేంద్ర అలియాస్ జాకీ, ఉపేంద్ర, మరో ముగ్గురితో వెళ్లి వంశీకృష్ణపై బీరుసీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో వంశీకృష్ణ, అతని సోదరుడు వెంకటేష్, వీరి తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంకీ, సురేంద్ర, ఉపేంద్రలతో పాటు మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ దాడి ఘటనలో సురేంద్ర అలియాస్ జాకీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఖాజీపేట : జాతరకు వెళ్లి తిరిగి వస్తూ కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన ఖాజీపేట మండలం ఆంజనేయపురం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రొద్దుటూరు రామేశ్వరానికి చెందిన రవీంద్ర (57) మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఖాజీపేట సీఐ రామాంజులు వివరాల మేరకు.. కడపకు చెందిన శ్రీనివాసులు, ఆంజనేయులు ప్రొద్దుటూరు రామేశ్వరానికి చెందిన రవీంద్రలు గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు చాపాడుకు వచ్చారు. జాతర ముగిశాక ప్రొద్దుటూరుకు వెళ్లి తిరిగి కడపకు వచ్చే క్రమంలో చెన్నూరు వద్ద కారు అదుపుతప్పి పెన్నానది బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొంది. ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
[ 29-04-2024]
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. -
రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్రెడ్డి ఏం చేశారు?
[ 29-04-2024]
కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పీహెచ్సీలన్నావ్... చేతులెత్తేశావ్..!
[ 29-04-2024]
‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రచారార్భాటంగా చేశారు. -
2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. -
తెదేపా ప్రచార రథంపై దాడి
[ 29-04-2024]
తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. -
అతివలే అధికం!
[ 29-04-2024]
జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. -
జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
[ 29-04-2024]
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. -
మహిళలే అధికం!
[ 29-04-2024]
జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు, 127 మంది ఇతరులు ఉన్నారు. -
నీరందించాలని నిరసన
[ 29-04-2024]
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. -
పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు
[ 29-04-2024]
మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. -
ఏపీసెట్కు 2,047 మంది హాజరు
[ 29-04-2024]
ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
దళితులకు బురిడీ.. జగనన్న దోపిడీ
[ 29-04-2024]
జగనన్న మైకు అందుకుంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు... ఆ మాటలు విన్న వారంతా ఆహా సీఎం గారికి మామీద ఎంత ప్రేమ అనుకున్నారు... తీరా గద్దెనెక్కిన తర్వాత వారి సంక్షేమంపై ఇనుప పాదం వేసి అణగదొక్కారు. -
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
[ 29-04-2024]
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్