logo

ఏడేళ్లనంతరం బయట పడిన చిత్రావతి వంతెన

కొండాపురం మండలంలోని గండికోట జలాశయంలో నీరు తగ్గడంతో కడప-తాడిపత్రి ప్రధాన పాత రహదారిలోని చిత్రావతి వంతెన ఏడేళ్ల అనంతరం బయటపడింది.

Published : 16 Apr 2024 02:38 IST

న్యూస్‌టుడే, కొండాపురం: కొండాపురం మండలంలోని గండికోట జలాశయంలో నీరు తగ్గడంతో కడప-తాడిపత్రి ప్రధాన పాత రహదారిలోని చిత్రావతి వంతెన ఏడేళ్ల అనంతరం బయటపడింది. 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం గండికోట జలాశయంలో తొలిసారి 8 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో వంతెన నీట మునిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా రహదారి, వంతెనను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిగువ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడంతో జలాశయంలో నీరు తగ్గి ఇలా వంతెన బయట పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు