సివిల్స్లో మెరిశారు!
దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్లో జిల్లా వాసులు సత్తా చాటారు. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇద్దరు యువకులు ర్యాంకులతో మెరిశారు.
ఇద్దరు జిల్లా యువకులకు ర్యాంకులు
దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్లో జిల్లా వాసులు సత్తా చాటారు. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇద్దరు యువకులు ర్యాంకులతో మెరిశారు. పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించింది ఒకరైతే... ప్రజలకు సేవలందించాలనే దృక్పథంతో రాణించింది మరొకరు.
పేరు : నిమ్మనపల్లి ప్రదీప్రెడ్డి
ఊరు : రాయచోటి, ర్యాంకు : 382
తల్లిదండ్రులు : సహదేవరెడ్డి, కళావతి
ప్రదీప్కు వైద్య రంగంపై ఆసక్తి ఉన్నా ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో 2020 సివిల్స్కి సన్నద్ధమయ్యారు. 2022లో సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో వెనుతిరిగారు. అయినా నిరుత్సాహ పడకుండా రోజుకు 14 గంటలపాటు చదువుతూ 2023లో పరీక్షలు రాయగా ప్రస్తుతం 382వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి అధ్యాపకుడు కాగా, తల్లి ఉపాధ్యాయురాలు, సోదరుడు మనోజ్రెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్నారు.
న్యూస్టుడే, రాయచోటి
పేరు : గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ్
ఊరు : గొల్లపల్లి, నందలూరు మండలం
ర్యాంకు: 444
తల్లిదండ్రులు : సుబ్బరామయ్య, సుజాతమ్మ
శ్రీవాస్తవ్ 2018 నుంచి సివిల్స్కు సన్నద్ధమవుతూ మొదటిసారి ప్రిలిమ్స్, మెయిన్స్లలో ఫెయిలయ్యారు. 2021 నుంచి 2023 వరకు వరుసగా మూడు సార్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూ వరకూ వెళ్లి వెనుతిరిగారు. తన అక్క, బావలు విద్యాధరి, బావ సోమశేఖర్ అప్పారావు ఇద్దరూ ఐఏఎస్లు కావడంతో వారి ప్రోత్సాహంతో పట్టువదలకుండా రోజుకు 18 గంటలు చదువుతూ 2023లో గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించి జిల్లా రిజిస్ట్రారుగా ఉద్యోగం సాధించారు. ఇలా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం 444వ ర్యాంకు సాధించారు. ఈయన తల్లిదండ్రులు గత 30 ఏళ్లుగా నందలూరులో గొబ్బిళ్ల విద్యాసంస్థల ద్వారా సేవలందిస్తున్నారు.
న్యూస్టుడే, నందలూరు
సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం. విభిన్నమైన ఆలోచనా విధానం. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్వైపు అడుగులేశారు. దేశవ్యాప్తంగా వేలమంది పరీక్షలు రాస్తే వారిలో జిల్లాకు చెందిన ఈ ముగ్గురు ఉన్నత శ్రేణిలో నిలబడ్డారు.
మర్రిపాటి నాగభరత్, పేరు : మర్రిపాటి నాగభరత్
ఊరు : చెర్లోపల్లె, ర్యాంకు : 580
తల్లిదండ్రులు : మర్రిపాటి నాగరాజు, సునంద
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నాగభరత్ చిన్ననాటి నుంచే పట్టుదలతో చదివేవారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ చదివి నాలుగేళ్లుగా న్యూదిల్లీ, హైదరాబాద్లలో సివిల్స్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ రోజుకి 17 గంటలు చదివేవారు. 2017లో తొలిసారి సివిల్స్ రాసి విఫలమయ్యారు. తన ఏడో ప్రయత్నంలో 580వ ర్యాంకు సాధించారు.
న్యూస్టుడే, బద్వేలు
పేరు : ధనుంజయకుమార్
ఊరు : కడప, ర్యాంకు : 810
తల్లిదండ్రులు : కృష్ణమూర్తి, ముత్యాలమ్మ
ఈయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వీరికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో అమ్మమ్మ కష్టపడి చదివించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో మేనేజరుగా పని చేస్తూ 2017లో గ్రూప్-1 పరీక్షలు రాసి 2018లో ఎక్సైజ్ సూపరింటెండెంట్గా విధుల్లో చేరారు. మొదటి పోస్టింగ్ అనంతపురంలో చేరగా, ప్రస్తుతం ప్రస్తుతం కడపలో పనిచేస్తున్నారు. రోజుకు 8 నుంచి 10 గంటల పాటు చదివి 810 ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు, భార్య రూప సహకారంతో విజయం సాధించినట్లు ఆయన తెలిపారు.
న్యూస్టుడే, కడప నేరవార్తలు
పేరు : డాక్టర్ కేసారపు మీనా
ఊరు : కడప, ర్యాంకు : 899
కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుకుంటున్నప్పుడు ఐఏఎస్ అధికారి డాక్టర్ భరత్గుప్తా గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల, వైద్యకళాశాలలో చదువుకుని సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఎంబీబీఎస్ పూర్తికాగానే సివిల్స్ రాశారు. ర్యాంకు రాలేదు. దీంతో రెండోసారి కొద్దిలో తప్పిపోయింది. మూడో ప్రయత్నంలో 899వ ర్యాంకు సాధించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
[ 29-04-2024]
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. -
రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్రెడ్డి ఏం చేశారు?
[ 29-04-2024]
కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పీహెచ్సీలన్నావ్... చేతులెత్తేశావ్..!
[ 29-04-2024]
‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రచారార్భాటంగా చేశారు. -
2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. -
తెదేపా ప్రచార రథంపై దాడి
[ 29-04-2024]
తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. -
అతివలే అధికం!
[ 29-04-2024]
జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. -
జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
[ 29-04-2024]
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. -
మహిళలే అధికం!
[ 29-04-2024]
జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు, 127 మంది ఇతరులు ఉన్నారు. -
నీరందించాలని నిరసన
[ 29-04-2024]
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. -
పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు
[ 29-04-2024]
మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. -
ఏపీసెట్కు 2,047 మంది హాజరు
[ 29-04-2024]
ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
దళితులకు బురిడీ.. జగనన్న దోపిడీ
[ 29-04-2024]
జగనన్న మైకు అందుకుంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు... ఆ మాటలు విన్న వారంతా ఆహా సీఎం గారికి మామీద ఎంత ప్రేమ అనుకున్నారు... తీరా గద్దెనెక్కిన తర్వాత వారి సంక్షేమంపై ఇనుప పాదం వేసి అణగదొక్కారు. -
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
[ 29-04-2024]
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్