ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యాజువాల్టీ (అత్యవసర విభాగం)లో వైద్యుల్లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి పెద్దాసుపత్రికి వస్తే, ఇక్కడ కనీస వైద్యం అందని పరిస్థితి నెలకొంది.
అత్యవసర విభాగంలో కానరాని వైద్యులు, సిబ్బంది
ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు
న్యూస్టుడే, సర్వజన ఆసుపత్రి
రాత్రి సమయంలో క్యాజువాల్టీ బయట వైద్యుల కోసం నిరీక్షిస్తున్న రోగులు
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యాజువాల్టీ (అత్యవసర విభాగం)లో వైద్యుల్లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి పెద్దాసుపత్రికి వస్తే, ఇక్కడ కనీస వైద్యం అందని పరిస్థితి నెలకొంది. రోజుకు దాదాపు 200 నుంచి 300 మందికి పైగా సర్వజన ఆసుపత్రి క్యాజువాల్టీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా మొదట ఇక్కడికే తీసుకొస్తారు. జనరల్ మెడిసిన్, ఆర్థో, చెవి, ముక్కు గొంతు, కంటికి సంబంధించిన శస్త్రచికిత్స వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. క్యాజువాల్టీకి వచ్చిన రోగిని తక్షణం పరిశీలించి అవసరమైతే ఇక్కడే వైద్యం చేసి రోగికి కొంత ఉపశమనం కలిగిన తరువాత పరిస్థితిని, వ్యాధి నిర్ధారణను బట్టి ఆయా విభాగాలకు తరలించాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. క్యాజు వాల్టీలో నర్సులు, ఒక్కరు లేదా ఇద్దరు హౌస్సర్జన్లు తప్పితే ఎవరూ ఉండడం లేదు. రోగులు వచ్చాక సిబ్బంది ఫోన్చేసి వైద్యులను పిలిపిస్తున్నారు. కొందరు వస్తారు. మరి కొందరు ఏమాత్రం పట్టించు కోవడంలేదు. స్పందించిన వారు ఆసుపత్రికి వచ్చేలోగా కనీసం గంటల పాటు రోగి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడకు రావడమే నేరం
మా అమ్మకు మూతి వంకర పోయి, కాళ్లు చేతులు చచ్చు పడిపోతున్నాయని 108 వాహనంలో రాయచోటి నుంచి రాత్రి 11 గంటలకు ఆసుపత్రికి వచ్చాం. క్యాజువాల్టీలో ఇద్దరు జూనియర్ వైద్యులున్నారు. బీపీ యంత్రాలు, పల్స్ మీటర్లు పనిచేయడంలేదు. ఉన్న సిబ్బంది పరిశీలించి సార్కు కాల్ చేశాం... వస్తారని చెప్పారు. అర్ధరాత్రి రెండు గంటలైనా వైద్యులు రాలేదు.
రమీజాబీ, రోగి కుమార్తె, రాయచోటి
ఊపిరి పోస్తున్నారా? తీస్తున్నారా?
మా చిన్నమ్మకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే 9 గంటలకు చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే రిమ్స్కు తీసుకెళ్లమన్నారు. ఇక్కడ క్యాజువాల్టీకి తీసుకొచ్చాం. వైద్యులు ఒక్కరు కూడా లేరు. దాదాపు గంట సేపు చూసినా ఒక్కరూ రాలేదు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోస్తారా? తీస్తారా?, అర్థం కావడంలేదు.
బాలకృష్ణ, రోగి కుమారుడు, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
[ 30-04-2024]
ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. -
జగన్ అరాచక కేళి.. జనం కావాలా బలి..!
[ 30-04-2024]
అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది. -
జగనాసుర.. ఎప్పుడైనా ఇటుకేసీ చూశావా?
[ 30-04-2024]
జగన్ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
నామపత్రాల ఉప సంహరణలు
[ 30-04-2024]
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 30-04-2024]
రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు. -
ట్రయల్రన్ పేరుతో పట్టణం దిగ్బంధం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్రన్ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. -
ప్రచారం... చేరికలు
[ 30-04-2024]
పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్, రెహ్మాన్, అస్యాక్, షేక్ ఆరీఫ్, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్, అబ్దుల్, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్, దినకర్, భాస్కర్, ఏసోబు, డేవిడ్ తెదేపాలో చేరారు. -
సీఎం పర్యటనతో విభాజికం ధ్వంసం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి. -
రోడ్డుపైనే సీఎం సభ... ప్రయాణాలు మానుకోండి!
[ 30-04-2024]
ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
[ 30-04-2024]
రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు. -
కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం
[ 30-04-2024]
వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
[ 30-04-2024]
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. -
బంగ్లామిట్ట... తాగునీటికి కటకట!
[ 30-04-2024]
రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని డైరెక్ట్ పంపింగ్ మోటారు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. -
వైకాపాకు యువజన రాష్ట్ర కార్యదర్శి రాజీనామా
[ 30-04-2024]
మైదుకూరుకు చెందిన వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం విలేకరులకు తెలిపారు. -
నేడు కలికిరికి సీఎం జగన్ రాక
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్కు పరిశీలించి చదును చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ