logo

సమస్యలతో తాండూరు వాసుల సతమతం: భాజపా

భాజపాతోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భాజపా జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, తాండూరు నియోజక వర్గ అధ్యక్షులు రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

Published : 20 Jan 2022 01:46 IST


సమావేశంలో మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి

బషీరాబాద్‌: భాజపాతోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భాజపా జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, తాండూరు నియోజక వర్గ అధ్యక్షులు రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలంతా రోడ్లు, కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ ఉన్నప్పటికీ ఇక్కడి నాయకులు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.. రాబోవు రోజుల్లో భాజపా అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మండల అధ్యక్షులు గంగాధర్‌, రాజ్‌కుమార్‌ కులకర్ణి, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్‌రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని