పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు.
భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి
మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పక్కన నాయకులు
ఈనాడు, కడప, న్యూస్టుడే, ములకలచెరువు గ్రామీణ: వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శనివారం నిర్వహించిన ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలైన తెదేపా, భాజపా, జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో మరింత దోపీడీ సాగిందని, అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీకే పాలు పోయాలని, పోయకుంటే కేసులు పెడతామని రైతుల్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు. మామిడి కిలో ధర రూ.20 ఉండగా రూ.8కి అమ్ముకోవాల్సి వస్తోందంటూ ఇలా.. పాడి, మామిడి రైతుల ద్వారా ఏటా రూ.132 కోట్ల మేర దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు పెద్ద ప్రాజెక్టుల పనులు రూ.2,145 కోట్లతో చేపట్టి రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల ద్వారా రూ.2 వేల కోట్ల దోపిడీకి పెద్దిరెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి నియోజకవర్గంలో ప్రజల్ని బెదిరించి పేదల భూములు కబ్జా చేశారని, వీటన్నింటినీ తిరిగి పేదలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మంజూరు చేసిన నిధుల్ని.. వైకాపా ప్రభుత్వంలో పెద్దిరెడ్డి పుంగనూరుకు మళ్లించుకుపోయి పనుల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, తెదేపా అసెంబ్లీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి మద్దతు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం!
[ 23-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు తమ బాధ్యతను విస్మరించడంతో కడప నగరంలోని గౌస్నగర్లో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది. -
రాజంపేటలో గంటన్నరకు పైగా నిలిచిన ఎక్స్ప్రెస్ రైలు
[ 23-05-2024]
రాజంపేట మండలం హస్తవరం రైలునిలయంలో సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో కన్యాకుమారి-ఫుణె ఎక్స్ప్రెస్ రైలు రాజంపేట రైలునిలయంలో బుధవారం 1.40 గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
ఆసుపత్రిలో చీకట్లు... రోగులకు ఇక్కట్లు
[ 23-05-2024]
సర్వజన ఆసుపత్రిలోని ఓపీ విభాగంలోని రక్త పరీక్షల విభాగం వద్ద విద్యుత్తు దీపాలు వెలడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నిధులున్నా నీరసమే!
[ 23-05-2024]
ప్రజారోగ్యశాఖ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించింది. వీటితో చేపడుతున్న పనులు క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని నగర పాలక, పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి పథకాలతోపాటు జగనన్న కాలనీల్లో తాగునీటి పనులు మందకొడిగా నడుస్తున్నాయి. -
నిధుల్లేక చతికిల‘బడి’!
[ 23-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను సమూల రూపురేఖలు మార్చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మనబడి...నాడు-నేడు పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. -
సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా : డీఐజీ
[ 23-05-2024]
ఓట్ల లెక్కింపు రోజున ఆయా జిల్లాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు ఆదేశించారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో పోలీసు అధికారులతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు. -
ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు
[ 23-05-2024]
జూన్ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
వనితల సహకారం.. హలధారికి ఊతం
[ 23-05-2024]
అంకిత భావం, సేవాగుణం, పట్టుదల ఉండాలే గాని ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారీ మహిళలు. ఉద్యాన, వ్యవసాయ విద్యలో ఎమ్మెస్సీ, పీహెచ్డీలు పూర్తి చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. -
గ్రావెల్ తరలింపుపై వైకాపా శ్రేణుల రగడ
[ 23-05-2024]
సీఎం జగన్ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో గ్రావెల్ తరలింపు విషయమై వైకాపాలో రగడ చోటు చేసుకుంది. తనకు ఇచ్చిన డీకేటీ భూమిలో యంత్రాలతో మట్టిని తరలించకూడదంటూ వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతిని అడ్డుకున్నారు. -
భూమేతల గుండెల్లో గుబులు!
[ 23-05-2024]
పీలేరులో భూ ఆక్రమణదారులు నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. అక్రమాన్ని సక్రమం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వం మారుతుందనే భయం వారిని వెంటాడుతోంది. -
ఇసుకాసురుల దాహానికి చెయ్యేరు బలి!
[ 23-05-2024]
చెయ్యేరు నది... జిల్లాలోని రాజంపేట, పెనగలూరు, పుల్లంపేట, చిట్వేలి, నందలూరు మండలాలకు సాగు, తాగునీరందించే జీవనాడి. ఇసుకాసురులు నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పంట కాలువలు, మాయమయ్యాయని ఆయా మండలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అడ్వాన్స్డ్కు అర్హుల్లో తెలుగువాళ్లే అత్యధికులు
-
అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు
-
ఐపీఎల్కు కార్తీక్ టాటా
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/05/24)