Chandrababu: ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతి చోటా ‘వైకాపా ఓడిపోవాలి’ అనే నినాదమే వినిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు
శృంగవరపుకోట: రాష్ట్రంలో ప్రతి చోటా ‘వైకాపా ఓడిపోవాలి’ అనే నినాదమే వినిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో తుపాన్లు చూశామని మే 13న రాబోయే తుపానులో వైకాపా కొట్టుకుపోయి.. బంగాళాఖాతంలో కలిసిపోవాలని అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. వైకాపా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మి అనే మహిళ వేలు కోసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వైకాపా అరాచక పాలన పోవాలనే ఆమె ఈ సాహసం చేశారని అన్నారు.
‘‘కర్నూల్లో అబ్దుల్ కుటుంబం వైకాపా పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయింది. ఒక అరాచక శక్తి, ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. జగన్ ఓ అహంకారి. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందంటే వారిని మరింత బాధపెడుతున్నారు. చివరికి హత్య చేస్తున్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీకి కూడా ఇబ్బందులు సృష్టించారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు. న్యాయం లేదు. జగన్ ఓ సైకో. ఈ ప్రభుత్వంలో రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయమైపోయింది. ఒక వ్యక్తి స్వార్థం కోసం.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
విశాఖను గంజాయి హబ్గా మార్చారు.
విశాఖను ఐటీ హబ్గా తయారు చేస్తే.. జగన్ మాత్రం ఓ గంజాయి హబ్గా మార్చారు. ఒక రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే.. విశాఖ ఓ పులివెందులలా మారిపోతుంది. పులివెందుల అంటే ఒక గొడ్డలి పోటు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చారు. అది కూడా వాగుల్లో.. వంకల్లో. రాష్ట్రం దోపిడీకి గురైంది. లాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో కాస్తో.. కూస్తో ఉన్న భూమిని కూడా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పట్టాదారు పుస్తకం పైన కూడా సైకో బొమ్మ వేసుకుంటున్నారు. చివరికి పొలంలో వేసే సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మే. ప్రతి 90 రోజులకొకసారి మీ భూముల రికార్డులు చెక్ చేసుకోకపోతే మీ భూములు గోవిందా. మంచి వాళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంటే అది భవిష్యత్కు ఉపయోగపడుతుంది.
జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ
జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. సరికొత్తగా గులక రాయి డ్రామాకు తెరలేపారు. సానుభూతి కోసం డ్రామాలు ఆడే వ్యక్తి జగన్. కోడి కత్తి డ్రామా కూడా అలానే చేశారు. 2019లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు చేశారా? వ్యవసాయం చచ్చిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రుషి కొండకు బోడి గుండు కొట్టారు. మీకు ఇచ్చింది ఒక సెంటు భూమి...ఆయన మాత్రం రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లను కట్టుకున్నాడు. పులివెందుల, హైదరాబాద్, బెంగళూరు ఇలా అనేక చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి. అవి సరిపోలేదని విశాఖలో కూడా ప్యాలెస్ కట్టేశారు. అప్పుడు కరెంట్ బిల్లు రూ.200 ఉంటే.. ఇప్పుడు రూ.1000 అయిపోయింది. పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలోనే నెంబర్ వన్. నిరుద్యోగంలోనూ నెంబర్ వన్. వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెదేపా, భాజపా, జనసేన కలిశాయంటే అది ప్రజల కోసమే. వైకాపా వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని పవన్ చెప్పారు. ఒకరు గొప్ప అనుకోకుండా అందరం త్యాగాలు చేశాం. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల విషయంలో ఒక మాటమీదకు వచ్చాం’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోన్లో బుగ్గన ఉక్కిరిబిక్కిరి!
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది. -
తండ్రీ బిడ్డల్ని దూరం చేసిన అంబటి రాంబాబు అసలు మనిషేనా?
‘నా బిడ్డల్ని నాలుగేళ్లుగా నాకు దూరం చేసి, నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి.. ఎలాంటి తప్పూ చేయలేదని బుకాయిస్తున్నారా? ఇదేనా న్యాయం’ అంటూ మంత్రి అంబటి రాంబాబును ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ ప్రశ్నించారు. -
అధికార పార్టీ అడ్డదారులు.. వైకాపా కూపన్ల పంపిణీకి అడ్డుకట్టేది?
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ అనేక అడ్డదారులు తొక్కుతోంది. ఇందులో భాగంగా తాయిలాలను అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేవీఉష, ఆమె భర్త శ్రీచరణ్రెడ్డి, సీఎం జగన్ చిత్రాలతోపాటు.. ఆ పార్టీ గుర్తు ఉన్న కూపన్లు, వాటి పక్కనే ఓటరు వివరాలను ముద్రించి ఓటర్లకు అందజేస్తున్నారు. -
ఎన్నికల వేళ.. వైకాపా మెడకు రైల్వేజోన్ ఉచ్చు!
ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైల్వే జోన్కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. -
పవన్ రోడ్షోకు అడ్డంకులు సృష్టించే యత్నం!
పిఠాపురంలో ఈ నెల 10న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న రోడ్షోకు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
ఓటుతో దిల్లీ పీఠం కదలాలి
‘బటన్ నొక్కితే డబ్బులు పడకుండా చంద్రబాబు చూస్తున్నారు. పథకాలను అడ్డుకుంటున్నారు. అవి అమలయ్యేలా చూడాలని కోర్టుకు వెళ్లాల్సి వస్తోందంటే ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి. -
పవన్కల్యాణ్ను ‘గెలిపించండి’
నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. -
మీ వాళ్లే వద్దంటున్నారు.. ప్రజలెలా నమ్ముతారు?
జగన్ను సొంత కుటుంబసభ్యులతో పాటు ఆయన పార్టీవారూ నమ్మడం లేదని, ప్రజలెలా నమ్మాలో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. -
జగన్, పెద్దిరెడ్డి.. ఖజానాను మింగేశారు
‘ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్(జగన్) ఉన్నారు. -
వైకాపా అభ్యర్థులు.. ‘సొంతింట్లో విలన్లు’!
‘అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ?’ పలువురు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది. -
జగన్ ముస్లిం ద్రోహి
గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంలో ముస్లింల మీద కిరాతకంగా దాడులు జరిగాయని కుల్ హింద్ తన్జీమ్ ముఫ్తియాన్ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. -
సీమలో వీరు 4,312 అడుగుల ఎత్తు నుంచి ఓటెయ్యనున్నారు!
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనుండగా.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, రాయలసీమ ఊటీగా పేరొందిన హార్సిలీహిల్స్లోని ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మాకేం చేశారని ఓట్లు అడగటానికి వచ్చారు?
‘మాకేం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు.. ఇంటి పట్టాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు గడపగడపకు మన ప్రభుత్వం సంక్షేమ పుస్తకాల్లో ముద్రించారు. -
మార్పు మొదలైందా!
ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఒప్పంద ఉద్యోగులు.. ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు. -
నా ఆమోదం లేదు కాబట్టే స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ జరగలేదు
తన ఆమోదం లేదు కాబట్టే మూడేళ్లుగా స్టీలుప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం వెనకడుగు వేస్తూ వచ్చిందని సీఎం జగన్ అన్నారు. -
వివేకాది గుండెపోటని ప్రసారం చేసింది భారతీనే
‘మాజీ మంత్రి వివేకా హత్య కేసును సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేసింది.. ఆ ఛానల్ను నడిపించే సీఎం జగన్ భార్య భారతి’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. -
తిరుపతి బరిపై కూటమి గురి
తిరుపతి లోక్సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రతికూలత కనిపిస్తోంది. ఐదేళ్లలో వైకాపా ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఇసుక దోపిడీ, సంక్షేమ పథకాలు అరకొరగా అందడం వంటివి ఓటర్లలో వైకాపాపట్ల విముఖతకు కారణాలవుతున్నాయి. -
ఎన్డీయేకు నవతరం పార్టీ మద్దతు
రాష్ట్రంలో జగన్ రాక్షసపాలనను అంతం చేయడానికి ఎన్డీయేకు భేషరతుగా మద్దతు తెలుపుతున్నట్టు నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై చర్యలు తీసుకోండి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా మహిళా నేతల చిత్రాల్ని అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసిన వ్యవహారం వెనక సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ ఉన్నారని తెదేపా నేతలు ఆరోపించారు. -
చనిపోయిన పింఛనుదార్లకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి
సామాజిక భద్రత పింఛన్లను ఇళ్ల వద్దే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులను బుట్టదాఖలు చేసి, వయోవృద్ధులను తీవ్ర ఎండల్లో ఇబ్బందులకు గురిచేసి.. వారి మరణాలకు కారణమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా మాజీ ఎంపీ, పార్టీ జాతీయ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్ మానవ హక్కుల సంఘాన్ని కోరారు. -
సిక్కోలులో అత్యధిక సర్వీసు ఓటర్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీసు సిబ్బంది పోస్టల్ బ్యాలట్ కోసం దరఖాస్తులు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు.