icon icon icon
icon icon icon

సిక్కోలులో అత్యధిక సర్వీసు ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీసు సిబ్బంది పోస్టల్‌ బ్యాలట్‌ కోసం దరఖాస్తులు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు.

Updated : 08 May 2024 06:50 IST

రాష్ట్రవ్యాప్తంగా 68,185 మంది

శ్రీకాకుళం (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీసు సిబ్బంది పోస్టల్‌ బ్యాలట్‌ కోసం దరఖాస్తులు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలతో పాటు సాయుధ దళాల్లో ఈ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపికై సేవలందిస్తుంటారు. అందువల్ల ఇక్కడ సర్వీసు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువగా సర్వీసు ఓటర్లు ఉన్నారు. పలాసలో 3,030, టెక్కలి (2,919), ఆమదాలవలస (2,240), నరసన్నపేటలో 2,228 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img