icon icon icon
icon icon icon

Chandrababu: జగన్‌ పాలనలో ఎక్కడ చూసినా.. కుంభకోణాలే: చంద్రబాబు

ఆడపిల్లలను చదివించి నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదుగుతారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 20 Apr 2024 13:38 IST

గూడూరు: ఆడపిల్లలను చదివించి నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదుగుతారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా అని పేర్కొన్నారు. గూడూరులో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

‘‘ప్రపంచంలో తెలుగు జాతి నంబర్‌ వన్‌గా ఉండాలన్నదే నా కోరిక. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్‌. రాష్ట్రంలో జగన్‌ పాలనలో ఎక్కడ చూసినా.. కుంభకోణాలే. సృష్టించిన సంపదను పేదవారికి ఇవ్వకుండా దోచుకుంటున్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని సున్నా చేయడమే నా జీవిత ఆశయం. మహిళల్లో చాలా చైతన్యం ఉంది. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. వారికి విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. గతంలో దీపం కింద వంట గ్యాస్‌ ఇస్తే దాన్ని ఆర్పేశారు’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img