మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు
ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుండా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.
2029 ఎన్నికల్లో సాధ్యమవుతాయి
తెదేపాతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంలో జరుగుతుంది
గూడూరులో మహిళలతో సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, తిరుపతి: ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుండా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు ఆడబిడ్డలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. 2029లో ఇది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా భాగస్వామిగా ఎన్డీయే ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. చిత్తూరు జిల్లా గూడూరులో శనివారం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘30 ఏళ్ల కిందట ఆడబిడ్డలు బయటకు వచ్చేవారుకాదు. ఆడబిడ్డలు ఉన్నతవిద్య చదవాలని ఎన్టీఆర్ శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చి ఆడపిల్లలకు అధికారం ఇచ్చింది తెదేపానే. ఉద్యోగాలు, కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. మహిళలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి ఎదురుకట్నం పుచ్చుకునే పరిస్థితి తెదేపా తెచ్చింది. డ్వాక్రాసంఘాలు తెచ్చి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాం. వడ్డీలేని రుణాలిచ్చాం’ అని చంద్రబాబు చెప్పారు.
చంద్రన్న మా డ్రైవర్ అని చెప్పండి
‘ఆడబిడ్డల కోసం మహాశక్తి పేరుతో పథకాలు తీసుకురానున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. దర్జాగా బస్సు ఎక్కి మా డ్రైవర్ చంద్రన్న, ఆయన అనుమతి ఇచ్చాడని చెప్పండి. పేదలకు పింఛను ఇచ్చింది, పెంచింది తెదేపానే. రానున్న రోజుల్లో ఇంటి దగ్గరనే మొదటి తారీఖున ఇస్తాం. ఇంటి దగ్గరే పింఛను ఇచ్చే అవకాశం ఉన్నా ఎండలో నిల్చోబెట్టి కొందరిని చంపేసి, శవరాజకీయాలు చేశారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నదే నా జీవితాశయం. దాన్ని చేసి చూపిస్తానని నా పుట్టినరోజున పేదలకు హామీ ఇస్తున్నా. నాకు ముఖ్యమంత్రి పదవి ఒక బాధ్యత. జగన్కు దోపిడీ చేసేందుకు ఒక లైసెన్సు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయిదేళ్లలో అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా గంజాయి విక్రయిస్తున్నారు. ఒక్కసారి పొరపాటున పిల్లలు గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడితే వాళ్లు మన చేతుల్లో ఉండరు. జగన్ దీన్ని నియంత్రించడం కాదు కదా.. కనీసం సమీక్షించలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకొచ్చారు. నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకోని దుర్మార్గుడు జగన్మోహన్రెడ్డి’ అని చెప్పారు. ‘నాడు విద్యుత్తు ఛార్జీ ఎంత? ఇప్పుడు ఎంత? నెలకు అదనంగా ఎంత చెల్లిస్తున్నాం? నాడు మద్యం ధర రూ.60 ఉంటే ఇప్పుడు రూ.200. నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ, పెట్రోల్ ధరల పేరుతో జగన్ ఎంత డబ్బు కొట్టేస్తున్నారో లెక్క వేయాలి. ఆసరా, పింఛను, ఆటో కార్మికులకు ఎంతిచ్చి, ఎంత లాక్కున్నారో లెక్కలు తేల్చాలి’ అని మహిళలకు సూచించారు.
ఇళ్లు కట్టిస్తాం
‘అందరికీ ఇళ్లు కట్టిస్తా. టిడ్కో ఇళ్లు ఉచితంగా అందిస్తాం. జగన్ ఒక్క సెంటు ఇచ్చి అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు తయారు చేశారు. ఇచ్చిన పట్టాలు రద్దు చేయం. కొత్తగా రెండు సెంట్ల స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తాం’ అని చంద్రబాబు చెప్పారు. ‘బటన్ నొక్కుతున్నానని జగన్ చెబుతున్నారు. ఎన్నికల్లో జగన్ చేసిన దుర్మార్గాలకు సమాధానంగా కూటమి అభ్యర్థుల గుర్తుపై బటన్ నొక్కాలి’ అని పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని వేదికపై ఆయనతో తెదేపా నాయకులు కేకు కోయించారు. మహిళలు, యువత ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘చంద్రబాబు సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు మహిళలు వైకాపా ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!