icon icon icon
icon icon icon

జగన్‌ ‘కట్టు’కథలు మే 13న కంచికి చేరుతాయి: లోకేశ్‌

లేని గాయానికి జగన్‌ వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఆయన ‘కట్టు’ కథలు మే 13న కంచికి చేరుతాయని ఎక్స్‌లో సోమవారం పోస్ట్‌ చేశారు.

Published : 23 Apr 2024 06:42 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: లేని గాయానికి జగన్‌ వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఆయన ‘కట్టు’ కథలు మే 13న కంచికి చేరుతాయని ఎక్స్‌లో సోమవారం పోస్ట్‌ చేశారు. ‘ఆ రాయి కోడికత్తి చరిత్రని తిరగరాసింది. చీకట్లో గురి తప్పకుండా ప్యాలెస్‌ రాయి రెండు పిట్టల్ని కొట్టేసింది. ‘కట్టు’ కథ కంటి..న్యూస్‌’ అని లోకేశ్‌ పోస్టు చేశారు.

తెదేపా కార్యాలయానికి నిప్పుపెట్టింది వైకాపా వాళ్లే

పల్నాడు జిల్లా నాగిరెడ్డిపాలెంలో తెదేపా కార్యాలయానికి నిప్పు పెట్టింది, పెదకూరపాడు మండలం తాళ్లూరులో పార్టీ ప్రచార రథం కళాకారులపై దాడి చేసిందీ వైకాపా వాళ్లేనని లోకేశ్‌ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే దారుణాలకు ఒడిగడుతున్నారని ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img