icon icon icon
icon icon icon

భూములిచ్చేయాలని.. ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు

విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య (వైకాపా) తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, భూములు లాక్కొనేందుకు యత్నిస్తున్నారని గజపతినగరం మండలం అంజీపురానికి చెందిన మేడిశెట్టి సుబ్బలక్ష్మి బొండాడ సభలో చంద్రబాబు ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు.

Published : 24 Apr 2024 06:07 IST

చంద్రబాబు ఎదుట మహిళ కన్నీటిపర్యంతం

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య (వైకాపా) తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, భూములు లాక్కొనేందుకు యత్నిస్తున్నారని గజపతినగరం మండలం అంజీపురానికి చెందిన మేడిశెట్టి సుబ్బలక్ష్మి బొండాడ సభలో చంద్రబాబు ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ‘గ్రామంలో మా వ్యవసాయ భూమిని లాక్కోవాలని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇటీవల రికార్డుల్లో పేర్లు సైతం మార్చేశారు. దీని వెనుక ఓ విశ్రాంత జేఈ, కొందరు వైకాపా నాయకులు ఉన్నారు. ఎవరినడిగినా ఎమ్మెల్యే పేరే చెబుతున్నారు. భూమి రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయి. రెండు రోజుల క్రితమే మా భూమిని దున్నేసి, స్తంభాలు పాతేశారు. దీంతో మనోవేదనకు గురై నా భర్త మంచానపడ్డారు. ఆసుపత్రిలో ఉండి సోమవారమే ఇంటికి వచ్చారు. నన్ను, నా భర్తను కాపాడండి. మాకు న్యాయం జరిగేలా చూడండి’ అని విలపించారు. ‘మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వారిని జైల్లో వేయిస్తా. అధికారంలోకి రాగానే భూమిని అప్పగించి, మీ భర్తను కాపాడతాం. అధికారంలోకి రాగానే భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img