icon icon icon
icon icon icon

రావి చెట్టు కింద అశోకుడు!

అశోక్‌ గజపతిరాజు.. పూసపాటి రాజవంశీయుల వారసుడు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం వివిధ శాఖలకు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. నిరాడంబర జీవితాన్నే గడుపుతుంటారు.

Updated : 25 Apr 2024 06:44 IST

 

న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం: అశోక్‌ గజపతిరాజు.. పూసపాటి రాజవంశీయుల వారసుడు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం వివిధ శాఖలకు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. నిరాడంబర జీవితాన్నే గడుపుతుంటారు. మధ్య తరగతి వ్యక్తిలా అందరితో కలిసిపోతారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు నామినేషన్‌ వేశారు. ఈ క్రమంలో అదితి గజపతిరాజు ర్యాలీగా బయలుదేరగా.. అశోక్‌ గజపతిరాజు మాత్రం ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె వచ్చే వరకూ అక్కడున్న రావిచెట్టు కింద కూర్చొని వేచి చూశారు. సామాన్యుడిలా ఆయనొక్కరే అలా కూర్చోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img