icon icon icon
icon icon icon

తెదేపాలో చేరిన అమ్మా ప్రసాద్‌

రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కో- ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ వీఏఆర్‌కే ప్రసాద్‌ (అమ్మా ప్రసాద్‌) తెదేపాలో చేరారు.

Published : 25 Apr 2024 06:36 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కో- ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ వీఏఆర్‌కే ప్రసాద్‌ (అమ్మా ప్రసాద్‌) తెదేపాలో చేరారు. ఉండవల్లిలోని తన నివాసంలో తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ బుధవారం ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో ఈయన వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో క్రియాశీలంగా పనిచేశారు. వైకాపా విధానాలు నచ్చకే తెదేపాలో చేరినట్టు అమ్మాప్రసాద్‌ తెలిపారు. ఆయనతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా బీసీ నేత పల్లపు శివరామకృష్ణ, పాదాల మధు, అబ్దుల్‌ఖాన్‌, కాటమాల అశోక్‌, మహ్మద్‌రఫీ తదితరులు తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img