icon icon icon
icon icon icon

చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ సహా భాజపా అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన వీరికి చంద్రబాబు స్వాగతం పలికారు.

Published : 26 Apr 2024 03:30 IST

ఉమ్మడి సభలు, ఎన్నికల వ్యూహాలపై చర్చ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ సహా భాజపా అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన వీరికి చంద్రబాబు స్వాగతం పలికారు. నేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి.. శాలువతో సత్కరించారు. ఉమ్మడి మ్యానిఫెస్టో, మూడు పార్టీల మధ్య సమన్వయం, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల గురించి చర్చ జరిగినట్టు సమాచారం. సుమారు రెండు గంటల పాటు భేటీ సాగింది. సమావేశంలో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్‌, జాతీయ సంయుక్తకార్యదర్శి శివ్‌ప్రకాశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img