icon icon icon
icon icon icon

రేపు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు.

Published : 05 May 2024 06:42 IST

ఈనాడు, అనకాపల్లి-న్యూస్‌టుడే, అనకాపల్లి, కశింకోట: ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు. తొలుత రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని వేమగిరిలో మధ్యాహ్నం 3.30గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 5.40గంటలకు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో నిర్వహించనున్న సభలో ప్రసంగిస్తారు. ముఖ్య అతిథులుగా తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img