icon icon icon
icon icon icon

పవన్‌ను ఇబ్బంది పెట్టాలని హెలిప్యాడ్‌ ధ్వంసం

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్‌ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు.

Published : 05 May 2024 06:41 IST

పొన్నూరులో కూటమి నేతల నిరసన

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్‌ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం పొన్నూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా హెలిప్యాడ్‌ నిర్మాణ అనుమతికి రోడ్డు భవనాల శాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన అధికారులు.. సీఎం దిగిన హెలిప్యాడ్‌ ఉపయోగించుకోవాలని సూచించారు. దాంతో అదే వినియోగించుకోవాలని కూటమి నేతలు భావించారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు హడావుడిగా పొక్లెయిన్‌ను పంపించి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. దీనిపై కూటమి నేతలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో పవన్‌ దిగేందుకు హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img