‘మీరు అడ్డా మార్చినా..’ మీ ఆగడాలను జనం మరిచేనా!
పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల ‘మంచితనా’నికి మచ్చుతునకలివి. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, యర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్, మార్కాపురానికి కె.బి.నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
పశ్చిమ ప్రకాశంలో వైకాపా ప్రజాప్రతినిధుల అరాచకాలు
జనం తిరస్కరిస్తారని ఏడాది క్రితమే అధిష్ఠానానికి స్పష్టత
నియోజకవర్గాలు మార్చి, మళ్లీ ఎన్నికల బరిలోకి
అలాంటివారు మా నెత్తిన ఎందుకని జనం ప్రశ్న
ఈనాడు, అమరావతి
- ఓ ఉపాధ్యాయుడు కష్టార్జితంతో స్థలం కొన్నారు. దానిపై కన్నేసిన ప్రజాప్రతినిధి సోదరుడు ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించాడు. కోర్టులో వివాదం నడుస్తుండగానే రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా కాజేశాడు. మార్కాపురం పట్టణంలో జరిగిన ఈ భూదందా ప్రజల్లో ఆందోళన కలిగించింది.
- తమ ప్రాంతానికి రోడ్డు వేయలేదని ప్రశ్నించిన పాపానికి జనసేన కార్యకర్తను ఎమ్మెల్యే స్వయంగా అవమానించారు. ఆపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. తిరిగొచ్చాక అవమానం భరించలేని ఆ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. గిద్దలూరు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
- ఇంజినీరింగ్ కళాశాల పేరుతో 90 ఎకరాలు, త్రిపురాంతకంలో 365 ఎకరాలు, యర్రగొండపాలెంలో రూ.40 కోట్ల విలువైన అసైన్డ్ భూముల ఆక్రమణ.. ఉపాధ్యాయుల బదిలీలు, పోస్టింగ్లలో అవినీతి.. వెరసి రూ.వందల కోట్లు కూడబెట్టారంటూ ఓ మంత్రిపై యర్రగొండపాలెంలో ప్రతిపక్షాలు ఏకంగా కరపత్రాలు పంచాయి.
పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల ‘మంచితనా’నికి మచ్చుతునకలివి. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, యర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్, మార్కాపురానికి కె.బి.నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సురేష్కు కేబినెట్లో చోటుదక్కింది. వీరు ఐదేళ్ల పదవీకాలంలో సమస్యలను గాలికొదిలేశారు. తమ తరఫున షాడో ఎమ్మెల్యేలను ముందుకుతెచ్చి, వారికి నియోజకవర్గాలను రాసిచ్చారు. అక్కడ ఏం చేయాలన్నా ఈ బినామీలకు కప్పం కట్టాల్సిందే. భూ ఆక్రమణలు, దందాలు, ప్రైవేటు పంచాయతీలు, కాంట్రాక్టులు, కమీషన్లతో ఐదేళ్లూ రెండు చేతులా వెనకేసుకున్నారు.
నమ్మకాన్ని సొమ్ము చేసుకొని..
ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు జనంలోనే కాదు, పార్టీ అధిష్ఠానం వద్దా నమ్మకం కోల్పోయారు. మళ్లీ అక్కడే పోటీచేస్తే డిపాజిట్లూ రావని గుర్తించిన అధినేత జగన్.. ముగ్గురి స్థానాలను అటూఇటూ మార్చారు. పాత నియోజకవర్గాల్లో అంటిన అవినీతి మరకను కొత్త స్థానాల్లో డబ్బుతో కడుక్కోవచ్చనే ధీమాతో వీరు ఎన్నికల బరిలోకి దిగారు. స్థానాలు మారినంత మాత్రాన నేతల ఆగడాలు, అరాచకాలను జనం మరిచిపోలేదని స్పష్టమవుతోంది. వారి దురాగతాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ మూడు రోజులపాట ఈ నియోజకవర్గాల్లోని ముండ్లపాడు, మార్కాపురం, గౌరవంతపాడు, మాల్యవంతునిపాడు, రామచంద్రాపురం, తిప్పాయపాలెం, కాటూరివారిపాలెం, తర్లుపాడు, కారుమానుపల్లె, మిర్జాపేట, కొండెపల్లి, నరసింహాపురం, పొదిలి, కంబాలపాడు, దరిమడుగు తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ పనితీరు, రాజకీయ పరిస్థితులపై రైతులు, విద్యార్థులు, గ్రామస్థులను ప్రశ్నించినపుడు ఆచితూచి స్పందించారు. మా మాటలు రికార్డు చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా పంపారా? ఉన్నది ఉన్నట్లు చెబితే పోలీసులు కేసులు పెడతారేమోనన్న భయాందోళన వారిలో వ్యక్తమైంది.
కొల్లగొట్టిన సొమ్ముతో ఓట్ల వేట
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం జగన్ పలుమార్లు హెచ్చరించినా దారికి రాలేదు. ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న వీరికి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోతారని ఏడాది క్రితమే పార్టీ చేయించిన సర్వేల్లో తేలింది. మంత్రి సురేష్కు యర్రగొండపాలెంలో డిపాజిట్ కూడా దక్కదని సొంత పార్టీ నేతలే జగన్కు వినతిపత్రమిచ్చారు. తమకు సీటు దక్కకుంటే తాడేపల్లి ప్యాలెస్ గుట్టు విప్పుతానని వీరిలో ఓ ఎమ్మెల్యే బెదిరించే వరకూ వెళ్లారని సమాచారం. గత్యంతరం లేక అధిష్ఠానం ముగ్గురి స్థానాలను మార్చింది. అన్నా రాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురానికి.. అక్కడి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేసింది. ఆదిమూలపు సురేష్ను కొండపికి పంపి, యర్రగొండపాలెంలో కొత్త అభ్యర్థి చంద్రశేఖర్ను పోటీకి దింపింది. అడ్డా మారిన అభ్యర్థులతో పాటు అక్రమాలూ బదిలీ అవుతాయని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరు కులాలు, మతాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ, అప్పనంగా సంపాదించిన సొమ్మును వెదజల్లుతున్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్తులకు డబ్బు ఎర వేసి తమవైపు లాక్కొంటున్నారు. ఓ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా 20 వేల మందితో బలప్రదర్శన చేశారు. ఒక్కొక్కరికి రూ.500, ఐదు రకాల వంటకాలతో విందు ఇచ్చారని సమాచారం.
అక్రమాలు.. ఆక్రమణలు.. అరాచకాలు
యర్రగొండపాలెం నియోజకవర్గంలో గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే వద్దకెళితే దర్శనమే కష్టమని త్రిపురాంతకం మండలానికి చెందిన ఒక రైతు తెలిపారు. ‘మీరు జగన్ను చూసి ఓటేశారు. నాకు కాదు. ఆయనకే చెప్పుకోండంటూ ఎగతాళి చేసేవార’ని అయ్యంగొట్లపాలెం గ్రామ రైతులు చెప్పారు. నియోజకవర్గంలో ఏడు రోడ్లకు శంకుస్థాపన చేసినా, రెండు మాత్రమే వేశారని రేళ్లపల్లివాసి వివరించారు. సురేష్ మంత్రి అయినా మా ఊళ్లకు చింతాకంత పని చేయలేదని పుల్లలచెరువు వాసి, విశ్రాంత ఉద్యోగి వాపోయారు. సొంతూరికీ ఏమీ చేయలేకపోయారని జనం పెదవి విరిచారు. ఉపాధ్యాయుల పోస్టింగ్స్, విద్యాసంస్థల అనుమతుల కోసం షాడో నాయకురాలు చెప్పిందే రేటు అన్నట్టుగా దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి.
- ఐదేళ్లలో మార్కాపురంలో భూకబ్జాలు పెచ్చుమీరాయని ఓ యువకుడు ఆవేశంగా చెప్పాడు. ‘ఎమ్మెల్యే బంధువులు అందినకాడికి దోచుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చెందిన రూ.10 కోట్ల స్థలాన్ని, అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు. వారికి అధికారులు, పోలీసులు సహకరించారు. బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించార’ని వివరించాడు. ఎమ్మెల్యే అనుచరులు కొత్త వెంచర్ల వద్ద వాలిపోవడం, వివాదాస్పద భూములను తక్కువ ధరకు సొంతం చేసుకోవటం, వినని వారిపై అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇక్కడ మామూలేనని పట్టణంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాపోయారు.
- గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును కలవాలంటే ముందుగా దళారులను ఆశ్రయించాలంటూ ముండ్లపాడు గ్రామ యువకులు వాపోయారు. కష్టాలు చెప్పుకొనేందుకు వెళ్లిన వారిని ఎమ్మెల్యే పరుషంగా తిట్టేవారన్న అపవాదు ఉంది. ఆయన తరఫున ఒక సామాజికవర్గ నాయకుడు చక్రం తిప్పేవాడని, కులాల వారీగా విభజించి గిట్టనివారిని వేధించేవారని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల ఆక్రమణ, జొన్నల కొనుగోలు అక్రమాల్లో ఎమ్మెల్యే కుటుంబసభ్యుల పాత్రపై ఆరోపణలున్నాయి.
ఓటేయని జనంపై ఇంతటి కక్షా?
నల్లమల అటవీ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలు. ఐదేళ్లలో సాగు, తాగునీటి కష్టాలను దూరంచేసే ఏ పనులనూ ఇక్కడి ఎమ్మెల్యేలు చేయలేదు. ఈ ఏడాది కరవు కారణంగా ఒక్క మార్కాపురం మండలంలోనే రైతులు సుమారు 20 వేల బోర్లు వేశారు. వెలిగొండ ప్రాజెక్టు లక్ష్యం సిద్ధించలేదు. వైకాపా నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో నీటి ట్యాంకర్లతో మంచినీరు అందిస్తున్నారు. తమ ఊళ్లలో గత ఎన్నికల్లో వైకాపాకు మెజార్టీ రాలేదన్న అక్కసుతో నీటి సరఫరా నిలిపివేశారని రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులను వైకాపా సర్కారు నిమిత్తమాత్రులను చేసిందని ఓ సర్పంచి గుర్తుచేశారు. ‘ఐదేళ్లలో ఒక్క రోడ్డూ వేయలేదు. బటన్లు నొక్కడం మినహా ఇంకేం చేయరా అని జనం ప్రశ్నిస్తుంటే తలెత్తుకోలేక పోతున్నామ’ని తెలిపారు. ప్రజలు విరాళాలతో విద్యుత్ దీపాలు అమర్చుకున్నారని పొదిలికి చెందిన విశ్రాంత ఉద్యోగి తెలిపారు. ‘తెదేపా ప్రభుత్వంలో మాకు రాయితీలు వచ్చేవి. ఇప్పుడు ఎత్తేశారు. పట్టు సాగును నమ్ముకున్న కుటుంబాలు తగ్గిపోయాయి. ప్రకృతి కంటే ప్రభుత్వమే ఎక్కువ దెబ్బతీసింది’ అని పొదలకొండపల్లెకు చెందిన రైతులు వాపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మూకదాడితో విజయవాడ వాసుల బెంబేలు
విజయవాడ విశాలాంధ్రకాలనీలో ఎస్టీ ఉద్యోగి మనోజ్కుమార్పై వైకాపా మూక దాడికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వేయడానికి వైకాపా ఇచ్చిన డబ్బు తీసుకోలేదని మనోజ్కుమార్పై ఆదివారం వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడిచేసిన విషయం తెలిసిందే. -
విశాఖ తీరంలో కూటమి విజయవిహారమే!
జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖ సాగర తీరం ఘోషిస్తూనే ఉంది. అది అల్పపీడనంలా ప్రారంభమై, వాయుగుండమై, తుపాను నుంచి ఉప్పెనలా మారబోతోంది. అధికార వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. ప్రశాంత తీరమైన విశాఖను విధ్వంసం చేశారన్న ఆవేదన అడుగడుగునా వినిపిస్తోంది. -
వైకాపాను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా!
‘వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది’ అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపం ప్రకటించారు. -
కొడాలికి ‘కోడ్’ వర్తించదా?.. రంగా విగ్రహానికి ముసుగు తొలగించి మరీ దండలు
కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు. -
ప్రచార రణంలో పంచ్లు!
‘వేసవిలోనే ఫ్యాన్ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్ లేచిపోయేలా.. జగన్ సర్కార్ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్ను 4లోనో, 5లోనో ఉంచండి’ -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్పై అదే నిర్లక్ష్యం
నాలుగు రోజులుగా పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. -
ఓటర్లకు డబ్బు పంచిన కానిస్టేబుల్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పోస్టల్ బ్యాలట్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ కానిస్టేబుల్ను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో వైకాపా మూకలు గొడవకు దిగి, రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
‘జీతంగా.. ప్రభుత్వ సొమ్ము’ విపక్షాలపై దుమ్ము
తన ఐదేళ్ల పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు.. ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు.. కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే.. తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం.. జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్ కోడ్ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు. -
కత్తికట్టిన అధికార పక్షం కట్టు తప్పిన రాష్ట్రం..
తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. -
పోస్టల్ బ్యాలట్కు బదులు ఈవీఎంపై సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలట్ పేపర్లు ఇవ్వాల్సింది పోయి తహసీల్దార్ ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని సీఈవో ముకేశ్కుమార్మీనాకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రం నుంచి కాలకేయులను తరిమికొడదాం
రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తినే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. -
అక్రమాలపై ‘అనంత’ గర్జన
అనంతపురం జిల్లాలో ఈసారి అధికార వైకాపా ‘ఎత్తిపోతాది’ అని జనం గళమెత్తుతున్నారు. జిల్లాలో ఏదో ఒక చోట అధికార పార్టీ నేతలు నిత్యం చేసే అరాచకాలు, ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలతో విసుగు చెందిన ప్రజలు మార్పునకు జై కొడుతున్నారు. వైకాపాకు అంతటా ఎదురుగాలి వీస్తోంది. -
సాయి ధరమ్తేజ్ లక్ష్యంగానే వైకాపా వర్గీయుల దాడి!
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆదివారం వైకాపా శ్రేణులు చేసిన దాడి సినీ హీరో సాయి ధరమ్తేజ్ లక్ష్యంగానే జరిగినట్లు తేటతెల్లమవుతోంది. జనసేన అధినేత పవన్కల్యాణ్కు మద్దతుగా సాయి ధరమ్తేజ్ ప్రచారం నిర్వహించగా.. ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. -
శభాష్.. ఓటు విలువ చాటారు!
వారున్న చోటుకు.. ఓటు వేసే ప్రాంతానికి చాలా దూరం. అయినా ఓటు హక్కు విలువ తెలిసి దూరభారమైనా.. వెళ్లి ఓటేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలానికి చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. -
కూటమికే కాపుల మద్దతు
ఎన్నికల్లో కాపుల మద్దతు తెదేపా, భాజపా, జనసేన కూటమికేనని కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా కాపులకు న్యాయం చేసింది తెదేపా అధినేత చంద్రబాబు అని గుర్తుచేశారు. -
తెదేపా ఎస్సీ నేత ఇంటికి నిప్పు
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో తెదేపా ఎస్సీ నాయకుడు దాసరి రఘు ఇంటికి దుండగులు నిప్పటించారు. దీంతో రేకుల ఇంటిలోని సామగ్రి దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంచికల్లులో తెదేపా నేత గోగుల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీలతో సమావేశం నిర్వహించారు. -
ఆర్యవైశ్యుల స్థలాలను కబ్జా చేసిన కొడాలి నాని అనుచరులు
గుడివాడలో ఆర్యవైశ్య సామాజిక వర్గంవారు కొనుగోలు చేసిన 11 ఇళ్ల స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరులు ఆక్రమించారని తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్కుమార్ ఆరోపించారు. -
జగన్ మానసిక స్థితే వేరు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్మోహన్రెడ్డి మానసిక స్థితిపై ఒక డాక్టర్ కొన్ని విషయాలు చెప్పారు. -
కూటమిలో కొత్త జోష్
కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం సభ జనసందోహంతో దద్దరిల్లింది. ప్రధాని మోదీ రాక ఎన్డీయే శ్రేణుల్లో మంచి జోష్ నింపింది. సభను విజయవంతం చేసేదిశగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు మూడు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. -
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. జగన్ ఇక ఇంటికే!
పోస్టల్ ఓట్లు కొనేందుకు వెళ్తున్న వైకాపాను ఉద్యోగులంతా ఛీ కొడుతున్నారని.. రాష్ట్రంలో జగన్ సీను అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులంతా ఎన్డీయేకు ఓట్లు వేశారని, ఇంకా వేస్తున్నారని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జగన్ ఇక ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..