icon icon icon
icon icon icon

పాస్టర్లకు వైకాపా తాయిలాలు!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలోని పాస్టర్లకు వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, అంబటి రాంబాబు తాయిలాలు ఇచ్చినట్లు తెలిసింది.

Published : 27 Apr 2024 05:44 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలోని పాస్టర్లకు వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, అంబటి రాంబాబు తాయిలాలు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కో పాస్టర్‌కు రూ.2,500 చొప్పున నగదును ఎంపీ అభ్యర్థి ఆధ్వర్యంలో అందజేశారని సమాచారం. శుక్రవారం సత్తెనపల్లిలోని శరభయ్య గుప్తా ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో పాస్టర్ల ఆత్మీయ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. అనుమతుల్లేకుండా పాస్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారని ఎన్నికల అధికారులకు పలువురి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అక్కడకు చేరుకుని అనుమతుల్లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని పాస్టర్లను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత పాస్టర్లకు వైకాపా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరై వైకాపాకు ఓటెయ్యాలని ప్రచారం చేయాలని పాస్టర్లను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img