వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలే..
సొంత బాబాయ్ని గొడ్డలితో నరికి చంపినవాణ్ని సీఎం జగన్ భుజాల మీద వేసుకుని తిరుగుతారు. సొంత చెల్లెలి దుస్తుల రంగుల గురించి హేళన చేస్తూ మాట్లాడతారు.
సీఎంపై గులకరాయి వేసిన వ్యక్తిని రోజుల్లోనే పట్టుకోగలరు
అంతర్వేది రథాన్ని కాల్చినవాళ్లను ఇన్నేళ్లయినా పట్టుకోలేదు
చెల్లెలి దుస్తుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిన జగన్
మలికిపురం వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ ధ్వజం
30న కూటమి మ్యానిఫెస్టో విడుదల
అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంటుందన్న జనసేనాని
సొంత బాబాయ్ని గొడ్డలితో నరికి చంపినవాణ్ని సీఎం జగన్ భుజాల మీద వేసుకుని తిరుగుతారు. సొంత చెల్లెలి దుస్తుల రంగుల గురించి హేళన చేస్తూ మాట్లాడతారు. తోడబుట్టిన చెల్లెలు ధరించిన దుస్తుల రంగులను ఎవరైనా చూస్తారా? పచ్చదనంపై ద్వేషం ఉంటే చెట్లను చూడడం మానేస్తామా? పసుపు రంగులో ఉన్నాయని బంతిపూలను విగ్రహాలకు వేయడం మానేస్తామా? జగన్ నా భార్యను, చంద్రబాబు సతీమణిని విమర్శించారు. ఇప్పుడు మరింత దిగజారి సొంత చెల్లెళ్లనూ తిడుతున్నారు. వైకాపా మళ్లీ వస్తే ఆడబిడ్డలకు రక్షణ ఉండదు.
పవన్ కల్యాణ్
ఈనాడు - రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్టుడే - ద్రాక్షారామ: ‘వైకాపా అవినీతిపరులను ఒకటే హెచ్చరిస్తున్నా.. 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం.. అక్రమాలు చేసిన ప్రతి వైకాపా నాయకుణ్నీ రోడ్డుపైకి లాగి తిన్నదంతా కక్కిస్తాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. జగన్ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోలు వేసుకుని తగలబెట్టుకున్నట్లే.. మీ నాశనాన్ని మీరే కొనితెచ్చుకున్నట్టేనని ప్రజలను అప్రమత్తం చేశారు. వైకాపా ఓడిపోవడం.. జగన్ ఇంటికెళ్లడం ఖాయమని పునరుద్ఘాటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం, రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేనాని ప్రసంగించారు. ఇప్పటికే తెదేపా సూపర్ సిక్స్తో ఆరు పథకాలు అమలు చేస్తామని ప్రకటించిందని, జనసేన మరో నాలుగు అంశాలు చెప్పిందని.. అన్నింటితో కలిపి అన్ని వర్గాలకూ న్యాయం చేస్తూ ఈ నెల 30న మ్యానిఫెస్టో ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు. ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
‘పొరపాటున వైకాపాకు ఓటేస్తే ఆడబిడ్డలకు భద్రత ఉండదు. యువతకు ఉపాధి అవకాశాలు రావు.. రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. భూదస్త్రాలు డిజిటలైజేషన్ చేస్తూ ప్రభుత్వ ఆస్తుల మాదిరిగా మీ ఆస్తులనూ జగన్ తాకట్టు పెట్టేస్తారు’ అని పవన్ నిప్పులు చెరిగారు. వైకాపా రద్దు చేసిన సహకార, సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ‘పీఏసీఎస్ల్లో ఒకప్పుడు దాతలను, పరిపాలనాదక్షులను ఛైర్మన్, డైరెక్టర్లుగా ఎన్నుకునేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ తీసేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబును డీసీసీబీ ఛైర్మన్గా నియమించారు. దళిత యువకుణ్ని హత్య చేసి, డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయి? డ్రైవర్ను చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలకు అతీగతీ లేదు. అంతర్వేది లక్ష్మీనారసింహుని రథాన్ని కాల్చేస్తే పిచ్చోడి పని అన్నారు. నిందితుణ్ని పట్టుకోలేదు. కానీ అంతమంది సమూహంలో ఒక గులకరాయి జగన్పై పడితే నిందితుణ్ని పట్టుకున్నారు. అంటే మీరు పట్టుకోవాలంటే పట్టుకోగలరు. కానీ అపోహలు, గొడవల మధ్య ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. విదేశీయుడైన కాటన్ను గుండెల్లో పెట్టుకున్నాం. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే ప్రజలు ఎందుకు గొడవపడతారు? వైకాపా వాళ్లే పేరు పెట్టి వాళ్ల నాయకులే గొడవ చేస్తారు. ఆ కేసుల్లో ఏ1గా ఉన్న అన్నెం సాయి ఈ రోజు మంత్రి విశ్వరూప్ వెనక ఉన్నారు. దీన్ని బట్టి గొడవలకు కారణమెవరో ఆలోచించాలి’ అని పవన్ ప్రజలను కోరారు.
మీరు ఒక చెయ్యెత్తితే మేం లక్ష చేతులెత్తుతాం
జగన్లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలాంటి దోపిడీదారులకు భయపడనని పవన్ స్పష్టం చేశారు. ‘చిత్తూరు జిల్లాలోని పీలేరు తదితర నియోజకవర్గాల్లో ఎవరైనా వేలు పెడితే సహించబోమని మిథున్రెడ్డి అన్నారు. వాళ్ల గురించి ఎవరూ మాట్లాడకూడదు. మిథున్రెడ్డి మాత్రం ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి అంశంలోనూ వేలు పెట్టొచ్చా? మీ ముగ్గురికి ఒకటే చెబుతున్నా. ఇది జనసేన. మీరు ఒక చెయ్యెత్తితే లక్ష చేతులెత్తుతాం’ అని జనసేనాని హెచ్చరించారు. అసెంబ్లీకి తాను వెళ్లుంటే పరిస్థితి వేరేలా ఉండేదని పవన్ వ్యాఖ్యానించారు. ‘ఉప్మాకో, కాఫీకో అమ్ముడుపోవద్దు. దశాబ్దంగా మీ కోసం నిలబడ్డానంటే అది మీరిచ్చిన బలమే. ఈ ఎన్నికల్లో తెదేపా, భాజపా అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా జనసేన ఓటు వారికే వేయాలి’ అని పవన్ కార్యకర్తలను కోరారు.
‘ప్రభుత్వం మారబోతుంది. మన ప్రభుత్వం వస్తోంది. వైకాపా అవినీతి కోటలు బద్దలుకొట్టాలి. కూటమి విజయం సాధించాలి. అందుకు మీ ఆశీస్సులు కావాలి’ అని ప్రజల్ని కోరారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో జనసేన, భాజపా, తెదేపా పోటీచేస్తున్నట్లేనన్నారు. పిఠాపురంలో తెదేపా సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. కూటమి తరఫున పోటీచేస్తున్న అమలాపురం లోక్సభ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, రాజోలు, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ అభ్యర్థులు దేవ వరప్రసాద్, వాసంశెట్టి సుభాష్, వేగుళ్ల జోగేశ్వరరావులను గెలిపించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలకు భూములు కట్టబెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: నారా భువనేశ్వరి
ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్: వైఎస్ భారతిపై షర్మిల ఫైర్
ఓటమి భయంతో అవినాష్రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
‘అమేఠీలో తుపాకుల పరిశ్రమ ఉంది’: పాక్ నేతకు స్మృతి ఇరానీ కౌంటర్
పాకిస్థాన్, రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్య ఉన్న సంబంధం ఏంటని భాజపా నాయకురాలు, అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) ప్రశ్నించారు. -
కూటమికి మద్దతుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రచారం
తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతుగా విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రచారం చేయనున్నారు. -
డోన్లో బుగ్గన ఉక్కిరిబిక్కిరి!
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది. -
తండ్రీ బిడ్డల్ని దూరం చేసిన అంబటి రాంబాబు అసలు మనిషేనా?
‘నా బిడ్డల్ని నాలుగేళ్లుగా నాకు దూరం చేసి, నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి.. ఎలాంటి తప్పూ చేయలేదని బుకాయిస్తున్నారా? ఇదేనా న్యాయం’ అంటూ మంత్రి అంబటి రాంబాబును ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ ప్రశ్నించారు. -
అధికార పార్టీ అడ్డదారులు.. వైకాపా కూపన్ల పంపిణీకి అడ్డుకట్టేది?
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ అనేక అడ్డదారులు తొక్కుతోంది. ఇందులో భాగంగా తాయిలాలను అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేవీఉష, ఆమె భర్త శ్రీచరణ్రెడ్డి, సీఎం జగన్ చిత్రాలతోపాటు.. ఆ పార్టీ గుర్తు ఉన్న కూపన్లు, వాటి పక్కనే ఓటరు వివరాలను ముద్రించి ఓటర్లకు అందజేస్తున్నారు. -
ఎన్నికల వేళ.. వైకాపా మెడకు రైల్వేజోన్ ఉచ్చు!
ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైల్వే జోన్కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. -
పవన్ రోడ్షోకు అడ్డంకులు సృష్టించే యత్నం!
పిఠాపురంలో ఈ నెల 10న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న రోడ్షోకు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
ఓటుతో దిల్లీ పీఠం కదలాలి
‘బటన్ నొక్కితే డబ్బులు పడకుండా చంద్రబాబు చూస్తున్నారు. పథకాలను అడ్డుకుంటున్నారు. అవి అమలయ్యేలా చూడాలని కోర్టుకు వెళ్లాల్సి వస్తోందంటే ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి. -
పవన్కల్యాణ్ను ‘గెలిపించండి’
నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. -
మీ వాళ్లే వద్దంటున్నారు.. ప్రజలెలా నమ్ముతారు?
జగన్ను సొంత కుటుంబసభ్యులతో పాటు ఆయన పార్టీవారూ నమ్మడం లేదని, ప్రజలెలా నమ్మాలో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. -
జగన్, పెద్దిరెడ్డి.. ఖజానాను మింగేశారు
‘ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్(జగన్) ఉన్నారు. -
వైకాపా అభ్యర్థులు.. ‘సొంతింట్లో విలన్లు’!
‘అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ?’ పలువురు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది. -
జగన్ ముస్లిం ద్రోహి
గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంలో ముస్లింల మీద కిరాతకంగా దాడులు జరిగాయని కుల్ హింద్ తన్జీమ్ ముఫ్తియాన్ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. -
సీమలో వీరు 4,312 అడుగుల ఎత్తు నుంచి ఓటెయ్యనున్నారు!
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనుండగా.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, రాయలసీమ ఊటీగా పేరొందిన హార్సిలీహిల్స్లోని ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మాకేం చేశారని ఓట్లు అడగటానికి వచ్చారు?
‘మాకేం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు.. ఇంటి పట్టాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు గడపగడపకు మన ప్రభుత్వం సంక్షేమ పుస్తకాల్లో ముద్రించారు. -
మార్పు మొదలైందా!
ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఒప్పంద ఉద్యోగులు.. ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు. -
నా ఆమోదం లేదు కాబట్టే స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ జరగలేదు
తన ఆమోదం లేదు కాబట్టే మూడేళ్లుగా స్టీలుప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం వెనకడుగు వేస్తూ వచ్చిందని సీఎం జగన్ అన్నారు. -
వివేకాది గుండెపోటని ప్రసారం చేసింది భారతీనే
‘మాజీ మంత్రి వివేకా హత్య కేసును సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేసింది.. ఆ ఛానల్ను నడిపించే సీఎం జగన్ భార్య భారతి’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. -
తిరుపతి బరిపై కూటమి గురి
తిరుపతి లోక్సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రతికూలత కనిపిస్తోంది. ఐదేళ్లలో వైకాపా ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఇసుక దోపిడీ, సంక్షేమ పథకాలు అరకొరగా అందడం వంటివి ఓటర్లలో వైకాపాపట్ల విముఖతకు కారణాలవుతున్నాయి.
తాజా వార్తలు
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?