icon icon icon
icon icon icon

చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి: భీశెట్టి బాబ్జీ

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలంతా అండగా నిలవాలని, వారికే ఓటేయాలని కోరారు.

Published : 28 Apr 2024 06:16 IST

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలంతా అండగా నిలవాలని, వారికే ఓటేయాలని కోరారు. శనివారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కొన్నిరోజులుగా నేను రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటించాను. అన్నిచోట్లా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఉత్తరాంధ్రకూ సీఎం జగన్‌ తీవ్ర అన్యాయం చేశారు. ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. గిరిజన గ్రామాల్లో రహదారుల ఏర్పాటు, వైద్య సదుపాయాల కల్పనపై కనీసం దృష్టిసారించలేదు. ఈ పరిస్థితి మారాలంటే కూటమి అధికారంలోకి రావాలి’ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజును ఆయన కలిసి సత్కరించారు. ఆమె విజయానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img