icon icon icon
icon icon icon

చంద్రన్న కోసం బెంగళూరులోని తెలుగు ప్రజల సంకల్పం

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

Published : 29 Apr 2024 06:49 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బెంగళూరులో ఉంటున్న తెలుగు వారు- ప్రత్యేకించి కుప్పం నియోజవర్గ వాసులను ఉద్దేశించి జనసేనతో కలిసి ఆ పార్టీ నేతలు రామమూర్తినగరలో ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కుప్పంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చంద్రబాబు తీసుకున్న చర్యలను ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ ఈ సందర్భంగా వివరించారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు తెదేపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తెలుగు ప్రజలపై ఉందన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకు, యువత భవిష్యత్తు కోసం ఇప్పటి ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. ఎన్నికల సమయంలో కుప్పంలో ఓటు హక్కు ఉన్నవారు కదలిరావాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img