icon icon icon
icon icon icon

పలువురు తెదేపా నాయకులపై సస్పెన్షన్‌ వేటు

పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పలువురు నాయకుల్ని తెదేపా నుంచి సస్పెండ్‌ చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated : 30 Apr 2024 08:02 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పలువురు నాయకుల్ని తెదేపా నుంచి సస్పెండ్‌ చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరానికి చెందిన మీసాల గీత, అమలాపురానికి చెందిన పరమట శ్యాంకుమార్‌, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండికి చెందిన వేటూకూరి వెంకటశివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img