జగన్ది హత్యా రాజకీయం.. నాది అభివృద్ధి రాజకీయం
‘నేను ఈ సైకోను చంపాలని ప్రయత్నిస్తున్నానని జగన్తో పాటు ఆయన భార్య కూడా ప్రచారం చేస్తున్నారు.. గొడ్డలితో వివేకాను హత్య చేయించింది ఎవరు.. కోడి కత్తి డ్రామా ఆడింది ఎవరు.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నది ఎవరు.. ఈ సైకో జగన్ కాదా! సొంత బాబాయ్ని చంపించి ఆయన కూతురు పైకే నేరం నెడుతున్నారు.
బాధితులనే నిందితులుగా చేస్తారు
ప్రజల ఆస్తులను మింగే నల్లచట్టం తెస్తున్నారు
దెందులూరు, తెనాలి సభల్లో చంద్రబాబు
ఈనాడు, ఏలూరు: ‘నేను ఈ సైకోను చంపాలని ప్రయత్నిస్తున్నానని జగన్తో పాటు ఆయన భార్య కూడా ప్రచారం చేస్తున్నారు.. గొడ్డలితో వివేకాను హత్య చేయించింది ఎవరు.. కోడి కత్తి డ్రామా ఆడింది ఎవరు.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నది ఎవరు.. ఈ సైకో జగన్ కాదా! సొంత బాబాయ్ని చంపించి ఆయన కూతురు పైకే నేరం నెడుతున్నారు. హత్యా రాజకీయాలు చేస్తోంది ఎవరో మీరే చెప్పండి. జగన్ది హత్యా రాజకీయం.. నాది అభివృద్ధి రాజకీయం.. ఈ రెండింటిలో ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో మంగళవారం ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘తప్పుడు కేసులు బనాయించినా.. అన్యాయంగా జైల్లో పెట్టినా నేను వెన్ను చూపలేదు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టను. 2047 నాటికి ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలన్నది నా ఆకాంక్ష. జగన్ పాలనలో జె బ్రాండ్ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలలో చెలగాటం ఆడుతున్నారు’ అని విమర్శించారు. ఆన్లైన్లో మీ రికార్డులు మార్చి మీ తలరాత మార్చేస్తారు. జగన్ నల్లచట్టం తీసుకొస్తున్నారు. అది అమల్లోకి వస్తే మీ ఆస్తులకు జగన్ యజమాని అయిపోతారు’ అని చంద్రబాబు అన్నారు.
జగన్ భార్యకూ పరాభవమే
‘జగన్ తరఫున సొంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఆయన భార్యకూ పరాభవం తప్పలేదు ‘మా తాతల కాలం నుంచి వారసత్వంగా ఇచ్చిన ఆస్తి పత్రాలపై మీ ఆయన ఫొటో ఎందుకు. ఇది న్యాయమా’ అని వైకాపా నాయకుడే ప్రశ్నించారు. ఇంతకు మించిన తిరుగుబాటు ఇంకేముంది? అయిదేళ్ల ఆశలను, ఆశయాలను నెరవేర్చేందుకు ఏర్పాటు చేసుకున్న కట్టుబాటే ఎన్నికల మ్యానిఫెస్టో. మేం ప్రకటించిన మ్యానిఫెస్టో అదిరిపోయింది. దీని ముందు సైకో మ్యానిఫెస్టో అడ్రస్ లేకుండా పోయింది’ అని చంద్రబాబు అన్నారు.
పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు
28 సార్లు పోలవరాన్ని సందర్శించి అభివృద్ధిని పరుగులు పెట్టించా. 72 శాతం నిర్మాణం పూర్తి చేశా. వైకాపా పాలనలో పోలవరాన్ని నాశనం చేసి గోదాట్లో కలిపేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని సీఎం ఒక పాలకుడా..పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిస్తాం’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘దెందులూరు ఎమ్మెల్యే అక్రమాలతో దెందులూరును దందాలూరుగా మార్చారు. తండ్రీ కొడుకులిద్దరూ వసూళ్ల దందా చేస్తున్నారు. రైతులకు గోనె సంచులివ్వలేని మంత్రి కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నారు.. ఆయనను ‘ఎర్రిపప్ప’ను చేసి ఇంటికి పంపించాలి’ అని చంద్రబాబు అన్నారు.
ముస్లింల రక్షణ, సంక్షేమం బాధ్యత మాది
ఈనాడు, అమరావతి: తెనాలిలో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయం అని వైకాపాకు ఓటేసి జీవితాలను మళ్లీ నాశనం చేసుకోవద్దని సూచించారు.‘రంజాన్ కానుకలు ఆపేసి ముస్లింల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్. ఆయన మైనార్టీల శ్రేయోభిలాషి ఎలా అవుతారు? మేము రంజాన్ తోఫా అందించాం. దుల్హన్ ద్వారా రూ.50 వేలు ఇచ్చాం. 36 వేల నిరుపేద ముస్లిం యువతులకు పెళ్లిళ్లు చేశాం. ఇవన్నీ జగన్ అమలు చేశారా? ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కోసం పోరాడాం. షాదీఖానాలు కట్టించాం. ఇమామ్లకు ఆర్థిక సాయం అందించాం, ఉర్దూ రెండో భాషగా చేశాం. ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. మేము వస్తే మసీదులు కూలుస్తాం అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మేము రద్దు చేయం. కాపాడతాం. మసీదులు నిర్మిస్తాం. సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో పార్లమెంటులో ఎవరు మద్దతు ఇచ్చారు? చీకటి ఒప్పందం మీది. ఏదైనా సరే చెప్పే ధైర్యం మాది. ఎందుకు కలిశామో ప్రజలకు చెప్పే చేస్తున్నాం. ప్రజల కోసం రాష్ట్రం కోసం కలిశాం. కేంద్రం సహకరించకపోతే నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుందని కలిశాం. సిద్ధార్థనాథ్ సింగ్ ఉన్నా మ్యానిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చాం. మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు వాటా ఇవ్వాలి. దుకాణాలన్నీ రాయించుకుని మీ దుకాణాల్లో మీతో కూలీ పని చేయిస్తారు’ అని పేర్కొన్నారు.
‘అవినాష్రెడ్డి చిన్న పిల్లాడా? బాబాయ్ను లేపేసిన వ్యక్తి అమాయకుడా? ఇలాంటి సైకోకు వ్యతిరేకంగా తిరగబడాలి. ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందని ఊరుకోవద్దు. ఓటేయకుంటే వాళ్ల గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. ఈ రౌడీలు మన ఇంటిని ఆక్రమిస్తారు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే రక్షించేవారు ఉండరు. తెనాలి ఎమ్మెల్యే జగనన్న కాలనీలకు ఇచ్చే ఇళ్ల స్థలాల భూసేకరణలో రూ. 80 కోట్లు దోచేశారు’ అని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం