icon icon icon
icon icon icon

శ్మశానంలోని శిలాఫలకాల పైనా జగన్‌ బొమ్మ ముద్రిస్తారేమో!

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతుల భూమి పాస్‌బుక్‌లు, హద్దురాళ్లపై ఫొటోలు వేసిన జగన్‌.. ఇక శ్మశానంలోని శిలాఫలకాలపైనా ఆయన బొమ్మ ముద్రించుకుటారేమోనని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు.

Published : 01 May 2024 04:22 IST

భాజపా నేత లంకా దినకర్‌ ఎద్దేవా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతుల భూమి పాస్‌బుక్‌లు, హద్దురాళ్లపై ఫొటోలు వేసిన జగన్‌.. ఇక శ్మశానంలోని శిలాఫలకాలపైనా ఆయన బొమ్మ ముద్రించుకుటారేమోనని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు. ఈ యాక్ట్‌ను కేంద్రమే తీసుకువచ్చిందని వైకాపా అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రెవెన్యూ చట్టాన్ని రాష్ట్రంలో కేంద్రమెలా అమలు చేస్తుందని ఓ ప్రకటనలో మంగళవారం ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తే, జగన్‌ ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలా ఈ చట్టాన్ని రూపొందించింది. పులివెందులలో తన పొలం పాస్‌బుక్‌ పై జగన్‌ ఫొటో ఎందుకని వైకాపా నేత భాస్కర్‌రెడ్డి ప్రశ్నించినా సీఎం జగన్‌ భార్య భారతిరెడ్డి ఏం చెప్పలేకపోయారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img