సంక్షిప్త వార్తలు (5)
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. భాజపా అభ్యర్థులు పోటీలో ఉన్న ధర్మవరం, కైకలూరు, ఆదోని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన రేపు
ఈనాడు, అమరావతి: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. భాజపా అభ్యర్థులు పోటీలో ఉన్న ధర్మవరం, కైకలూరు, ఆదోని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో నడ్డా ఈ మూడుచోట్ల పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ నెల 4 నుంచి, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై 9, 10, 11వ తేదీల్లో మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్షోకు ట్రయల్ రన్
విజయవాడ నగరంలోని బెంజ్సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ డిపో వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ట్రయల్ రన్ జరిగింది. మోదీ ఈ నెల 7, 8 లేదా 8, 9వ తేదీల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రచారం ముగింపు రోజు రాష్ట్రంలో మూడు సభల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.
కూటమి ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు ప్రాధాన్యం
తెదేపా నేత నీలాయపాలెం విజయ్కుమార్
ఈనాడు డిజిటల్, అమరావతి: విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహ ధ్వంసం, అంతర్వేదిలో రథం దహనం ఘటనలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్న ఎన్డీఏ మ్యానిఫెస్టో.. హిందువులకు ఊరట కలిగిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎన్డీయే మ్యానిఫెస్టోలో బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను తగినన్ని నిధులతో పునరుద్ధరిస్తామనడం ప్రశంసనీయం. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీసం వేతనం, రూ.50 వేల ఆదాయం వచ్చే ఆలయాల్లోని అర్చకులకు నెలకు రూ.15 వేలు, అంతకంటే తక్కువ ఆదాయం గల ఆలయాల్లోని అర్చకులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వడం అభినందనీయం’ అని విజయ్కుమార్ తెలిపారు.
ఆలయాలపై దాడులు చేసి... అభివృద్ధి చేస్తామంటారా?: సుధీష్ రాంబొట్ల
ఈనాడు, అమరావతి: గత ఐదేళ్లలో వైకాపా రాక్షస పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా దోచుకొని..దాచుకోవటమే సిద్ధాంతంగా వైకాపా పనిచేసిందన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం మాట్లాడుతూ వైకాపా పాలనలో హిందూ దేవాలయాలు, సంస్థలపై దాడులు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. వీటి గురించి ఏమీ తెలియనట్లు మ్యానిఫెస్టోలో హిందూ దేవాలయాల అభివృద్ధి చేస్తామని వైకాపా పేర్కొనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వివాహ వేడుకలో పండితుడి పై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: నారాయణ
హైదరాబాద్, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటారా? ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆ రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ అన్నారు.మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ను జైలులో పెట్టేందుకు మోదీ అమిత్షా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం