icon icon icon
icon icon icon

ప్రజల ఆస్తిపత్రాలపై మీ బొమ్మ ఎందుకు జగన్‌?

ప్రజల భూములు, ఆస్తి పత్రాలపై సీఎం జగన్‌ బొమ్మలెందుకని పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత భాస్కరరెడ్డి.. సీఎం జగన్‌ సతీమణి భారతిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 01 May 2024 06:00 IST

సమాధానం చెప్పండి?: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల భూములు, ఆస్తి పత్రాలపై సీఎం జగన్‌ బొమ్మలెందుకని పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత భాస్కరరెడ్డి.. సీఎం జగన్‌ సతీమణి భారతిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ఈ ప్రశ్నకు ఆమె వద్దే కాదు.. మీ దగ్గరైనా సమాధానం ఉంటే చెప్పండి. ప్రజల      ఆస్తి పత్రాలపై మీ బొమ్మ ఎందుకని రాష్ట్రమంతా అడుగుతోంది. జవాబు ఉందా మీ దగ్గర?’’ అని జగన్‌ను ఉద్దేశించి లోకేశ్‌ మంగళవారం ప్రశ్నించారు. భారతిరెడ్డిని భాస్కరరెడ్డి ప్రశ్నిస్తున్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.

లోకేశ్‌ యాత్రలో స్వల్పమార్పులు

యువతను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా మంగళవారం నుంచి తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యాత్ర షెడ్యూల్‌లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. మే ఒకటో తేదీన నెల్లూరు, 2న చిత్తూరు, 3న నంద్యాల, 4న కర్నూలు, 5న రాజంపేట, 6న ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img