icon icon icon
icon icon icon

రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన జగన్‌

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారని భాజపా నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ అన్నారు.

Published : 01 May 2024 06:17 IST

భాజపా నాయకురాలు ఖుష్బూ

కశింకోట, న్యూస్‌టుడే: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారని భాజపా నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో మంగళవారం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. రోడ్‌ షోలో పాల్గొని వైకాపా అరాచకాలను ఎండగట్టారు. అభివృద్ధిని కాంక్షించే సీఎం.రమేశ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణలను గెలిపించాలని కోరారు. రమేశ్‌ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి రావడం ఖాయమని పేర్కొన్నారు. కమలం, గ్లాసు గుర్తులను చూపిస్తూ ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img