ప్రాణాలకు తెగించి నయవంచకుడితో తలపడుతున్నా!
‘సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి.. ఒక నయవంచకుడు, గూండా, ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై.. గుండె చప్పుడై.. ఇక్కడ ఉన్నా’ అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.
జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది
వైకాపాకు ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే
కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దుచేస్తాం
వారాహి విజయభేరి సభల్లో పవన్ కల్యాణ్
ఈనాడు-విశాఖపట్నం, అనకాపల్లి, రాజమహేంద్రవరం: ‘సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి.. ఒక నయవంచకుడు, గూండా, ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై.. గుండె చప్పుడై.. ఇక్కడ ఉన్నా’ అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ‘నాన్న లేని బిడ్డను ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని జగన్ అడిగితే అంతా ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది.. ఇక చాలు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చూశారు.. ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి.. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ తీసుకోండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పెందుర్తి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటల్లో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఆడబిడ్డల భద్రతకు పెద్దపీట వేస్తాం. వైకాపా వారికి ఒక్కఛాన్స్ ఇస్తే రూ.60 ఉన్న మద్యంను రూ.200కు పెంచి జలగలా పీల్చేశారు. రూ.41 వేల కోట్లకు ఇసుకను అమ్మేశారు. కనిపించే కొండ ఎవరిది? గాలి.. నీరు.. నిప్పు..నేలా మనందరివీ.. ఒక్క జగన్వో, వైకాపా ఎమ్మెల్యేలవో కాదు’ అని పవన్ స్పష్టం చేశారు.
జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
‘మీ ఆస్తులను దోచేయడానికి జగన్ ఒక చట్టం తెస్తున్నారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. ‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్’. మరో దఫా వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులకు రక్షణ ఉండదు. ఆస్తి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు? ఒరిజినల్ స్టాంపు పేపర్లు, పట్టాదారు పాసు పుస్తకాలు మన దగ్గర ఉండాలి. ఈ చట్టం వస్తే జిరాక్సులే ఉంటాయి. ఎవరైనా కబ్జా చేస్తే రెవెన్యూ అధికారి దగ్గరకు వెళ్లాలట. వాళ్లంతా ఒక్కటైతే పరిస్థితి ఏంటి? అక్కడ అన్యాయం జరిగితే ఎంతమంది కోర్టుకు వెళ్లగలరు. వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాలిలో దీపాలే. మీ ఆస్తి పత్రాల ఒరిజినల్స్ అన్నీ హైదరాబాద్లోని జగన్ ఇంట్లో ఉంటాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ చట్టం కేంద్రం తెచ్చిందని వైకాపా నాయకులు అంటున్నారు. కేంద్రం ముసాయిదా మాత్రమే పంపుతుంది. దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలి కానీ చర్చించరు. తెదేపా వారిని మాట్లాడనీయరు. పట్టాదారు పాసు పుస్తకంపై రాజముద్ర ఉండాలి, మీ ఫొటో కాదు జగన్.. పాస్పోర్ట్పై ప్రధాని ఫొటో లేదు కదా’ అని వైకాపా సర్కారుపై పవన్ విమర్శలు గుప్పించారు.
యువత మార్పు కోరుకోవాలి
‘యువత మార్పు కోరుకుంటే తప్ప ఏదీ జరగదు. రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి బానిసైంది. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని గంజాయి రవాణాలో తొలి స్థానంలో పెట్టారు. పోర్టులో రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. రూ.450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఉద్యోగుల తాలూకా గ్రాట్యుటీ ఫండ్ దోచేశారు. ఇన్ని చేసి.. మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే.. ‘గెట్ లాస్ట్ జగన్’ అనండి. చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని చెత్తలో పడేద్దాం’ అంటూ పవన్ పిలుపునిచ్చారు. ‘పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ తీసుకురావడానికి కృషి చేస్తాం. అచ్యుతాపురం సెజ్ కోసం 26 గ్రామాల నుంచి 4 వేల ఎకరాలిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వారికి అండగా నిలుస్తాం. భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసేందుకు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తాం. సహజ వనరులు జగన్రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డిల సొంతం కాదు. గుత్తాధిపత్యంతో పెత్తనం చేస్తానంటే తొక్కేస్తాం. జగన్ కులాలను వాడుకొని ఎదుగుతున్నారు. మనం వాటిని దాటకపోతే రాష్ట్రం నాశనమైపోతుంది. రైతుల సమస్యలు పరిష్కారమవ్వాలంటే వైకాపాకు పొలిటికల్ హాలీడే ప్రకటించాలి’ అని ధ్వజమెత్తారు. ‘మండపేటకు వెళితే రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్, చిరంజీవి ఫొటోలు పెట్టారు. అల్లు అర్జున్ ఫొటో పెట్టి తగ్గేదేలే అంటూ యువత ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. యువత ఎన్నికల సమయంలో వైకాపాకు ‘తగ్గేదేలే’ అని చెప్పి గద్దె దించుతామనండి’ అంటూ పవన్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యానిఫెస్టో ప్రకటించామని వివరించారు.
కన్నబాబురాజు కాదు కన్నాల బాబు
‘ఎలమంచిలి వైకాపా ఎమ్మెల్యే కన్నబాబురాజు కాదు.. కన్నాల బాబు అని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. సింహాచలం భూముల్లో పంచగ్రామాల సమస్యపై ఇప్పటికీ నలుగుతోంది. కన్నబాబురాజు సింహాచలం ఆలయ భూమి ఆక్రమించి భారీ భవనం నిర్మిస్తే అడిగే దిక్కులేదు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చిన జగన్ తర్వాత పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తానే ముందుండి తాడి గ్రామాన్ని క్షేమంగా మరో ప్రాంతానికి తరలిస్తాం’ అని హామీ ఇచ్చారు. అనకాపల్లి లోక్సభ ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేష్ (భాజపా), ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ (జనసేన), పెందుర్తి అసెంబ్లీ నుంచి పంచకర్ల రమేష్బాబు (జనసేన)లను గెలిపించాలని పవన్ కోరారు.
ద్వారంపూడి కుటుంబంతో రైతులకు కన్నీరు
‘కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట్లోని వారికే మూడు పదవులున్నాయి. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల కష్టాన్ని జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం దోచుకుంటోంది. వారి అక్రమాలు ఆపేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలి. కోనసీమ జిల్లాలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్చంద్రబోస్ ఒకప్పుడు కొట్టుకున్నా, రాజకీయ అవసరాల కోసం కలిశారు. వీరు యానాం-రావులపాలెం ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి ఎందుకు పనిచేయలేదో ఆలోచించాలి. కోనసీమ అల్లర్ల పేరుతో ఎక్కువమంది అమాయకులపై కేసులు పెడితే.. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్చంద్రబోస్లు వారికి అండగా నిలవలేదు. ఓట్ల కోసం ఇటీవల కేసులు ఎత్తేస్తే, అందులో ఏ1.. మంత్రి విశ్వరూప్ వెనుక తిరుగుతున్నారు. దీన్నిబట్టి ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారో ఆలోచించాలి’ అని కోరారు. మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి హరీష్మాథుర్లను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొన్నారు. విజయభేరి సభల్లో పవన్ ముందుగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్