icon icon icon
icon icon icon

6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన

రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమహేంద్రవరం, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోల్లో మోదీ పాల్గొననున్నారు.

Published : 04 May 2024 05:36 IST

పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమహేంద్రవరం, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు సంబంధిత వివరాలను విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు, జనసేన అధికార ప్రతినిధి గౌతమ్‌ శుక్రవారం వెల్లడించారు. ఆయా సభలు, రోడ్‌ షోలకు తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు.

  • మే 6 సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు.
  •  మే 8 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img