icon icon icon
icon icon icon

బాధ్యతతో కూడిన రాజకీయాల కోసం వచ్చా

బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికే వచ్చానని జైభారత్‌ నేషనల్‌ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.

Published : 06 May 2024 05:48 IST

మ్యానిఫెస్టో విడుదల చేసిన జేబీఎన్‌పీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ

విశాఖపట్నం (గురుద్వారా), న్యూస్‌టుడే: బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికే వచ్చానని జైభారత్‌ నేషనల్‌ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘ఏదో మాయమాటలు చెప్పి ప్రజలను ఏమార్చడానికి రాలేదు. మేము ఇచ్చే 34 అంశాలతో కూడిన వాగ్దానాలకు చట్టబద్ధత కల్పించేందుకు వంద రూపాయల బాండ్‌ పేపర్‌పై రాసి ఇస్తున్నాం. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరించి ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’ అని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో గంజాయి బారి నుంచి యువతను రక్షించడం, పేదలకు రెండు పడకల గది ఇళ్లు వంటి అంశాలున్నాయని తెలిపారు. ఓటర్లు డబ్బుకు లొంగకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్టీ ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img