icon icon icon
icon icon icon

వైకాపా రాక్షస పాలనలో అందరూ బాధితులే

వైకాపా రాక్షస పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సామాన్యులు బాధితులుగా మిగిలిపోయారని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి అన్నారు.

Updated : 09 May 2024 07:18 IST

13న ఓటేసి జగన్‌ పార్టీని తరిమికొట్టాలి
కుప్పం ఎన్నికల ప్రచారంలో భువనేశ్వరి

కుప్పం, న్యూస్‌టుడే: వైకాపా రాక్షస పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సామాన్యులు బాధితులుగా మిగిలిపోయారని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె రామకుప్పంలో సభ, పీఎంకే తండాలో గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ పాలనలో అవినీతి, అక్రమాలు, సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేసి, అక్రమ కేసులతో వేధించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కొరవడిందని తెలిపారు.

మద్యం, గంజాయి మత్తులో వైకాపా నేతలే మహిళలపై హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే.. జగన్‌ సర్కారుకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీని కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు శ్రమించిన విషయాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు.

ఈనెల 13న పోలింగ్‌లో అందరూ పాల్గొని ఓటు అనే ఆయుధంతో జగన్‌ పార్టీని తరిమికొట్టాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అంధకారంలోకి వెళ్లిందని.. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img