icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ వేళ.. ఉపాధ్యాయులకు వైకాపా తాయిలాల ఎర

పోస్టల్‌ బ్యాలట్‌ ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.

Updated : 06 May 2024 08:38 IST

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డివిజన్‌ కేంద్రాల్లో ఉపాధ్యాయుల పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఆయా కేంద్రాలకు వచ్చిన అధికార పార్టీ నాయకులు... కొంత మంది ఉపాధ్యాయులకు తాయిలాలు అందించారు. రూ.2100 విలువ చేసే 25 గ్రాముల వెండి నాణేలు పంచారు. కొంత మంది వాటిని తీసుకోకుండా తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img