Pawan Kalyan: జగన్ను గద్దె దించే వరకు యువత పోరాడాలి: పవన్ కల్యాణ్
రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమైనా సీఎం జగన్ ఒక్కసారి కూడా స్పందించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
కాకినాడ: రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమైనా సీఎం జగన్ ఒక్క సారి కూడా స్పందించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గంజాయి దొరుకుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి విక్రయించే వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ద్వారంపూడి, కన్నబాబుకు నరకం అంటే ఏంటో చూపిస్తాం. వారి అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. జగన్ సీఎంలా కాకుండా ..సారా వ్యాపారిలా మాట్లాడుతున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు అవినీతి పరాకాష్ఠకు చేరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్ వేస్తే కన్నబాబుకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. వీళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువత రౌడీయిజానికి భయపడితే ఎక్కడికి పారిపోతారు. మీలో ధైర్యం కల్పించేందుకే ఇక్కడికి వచ్చా. జగన్ను గద్దె దించే వరకు యువత పోరాడాలి. ఐదేళ్లలో రూ.70కోట్లు ట్యాక్స్ కట్టానంటే ఎంత సంపాదించగలనో అర్థం చేసుకోండి. ఇంత డబ్బు సంపాదించి కూడా నేను ఎందుకు రోడ్లపై తిరుగుతున్నానంటే ఈ నేలకోసం కష్టపడే కొంత మంది వ్యక్తుల సమూహం కావాలి. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ముఖ్యమంత్రి ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు బాధేస్తోంది. కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు దగ్ధమవుతున్నాయి. కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి బోటులో గంజాయి ఉందని గుర్తిస్తే చాలు.. స్మగ్లర్లు దాన్ని తగలబెట్టేసి వెళ్లిపోతున్నారు. 16, 17 ఏళ్ల యువత కూడా గంజాయికి బానిసలవుతున్నారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేస్తేనే సమాజం బాగుపడుతుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వీరవిధేయ పోలీసులపై వేటు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ముకాసిన పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వి.శ్రీహరిలను బదిలీ చేసింది. -
ఏపీలో ఆదివారం బ్యాంకులు పనిచేసేలా చూడండి: చర్చనీయాంశమైన ఆర్థికశాఖ అధికారుల లేఖ
ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలు పనిచేసేలా చూడాలని ఆర్థికశాఖ అధికారులు డీజీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది. -
హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. -
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది? సీఎంగా స్పష్టతతో సమాధానం చెప్పండి
ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే కనీస అర్హత లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. -
ముస్లింల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బతీశారు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో ముస్లింలపై దాడులు, అరాచకాలు పెచ్చరిల్లాయని, దాదాపు 107 ఘటనలు చోటుచేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని, ఏ ఒక్క ఘటననూ సీఎం ఖండించడంగానీ, బాధితుల పక్షాన నిలబడటంగానీ, వారిని పరామర్శించడం గానీ చేయలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ ధ్వజమెత్తారు. -
ప్రశ్నించే గొంతుకలపై పైశాచికత్వం!
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం అమలవుతూనే ఉంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, చెప్పినట్లు వినకపోతే దాడులు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు.. ఇలా వైకాపా నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలనే కాదు.. -
శిరోముండనం కేసు తీర్పు అమలుపై స్టే జూన్ 20 వరకు పొడిగింపు
దళితులకు శిరోముండనం ఘటనలో మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఇతర దోషులకు 18 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు జూన్ 20 వరకు పొడిగించింది. -
ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. యావదాస్తి దానమిచ్చినట్లే!
‘2024 సంవత్సరం మే నెల 13న.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. -
ప్రచారానికి వెళ్లిన వారికి నకిలీ నోట్ల పంపిణీ
ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజు కూలీలకు.. నాయకులు నకిలీ నోట్లు పంపిణీ చేసిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో బుధవారం వెలుగుచూసింది. ‘ఓ ప్రధాన పార్టీ నాయకులు రూ. 200 కూలి ఇస్తామంటే ప్రచారానికి వెళ్లాం. -
బీసీల హత్యలపై ఒక్కరోజైనా మాట్లాడారా?
సీఎం జగన్ ఐదేళ్ల పాలన... వెనకబడిన తరగతుల ఉనికిని దెబ్బతీసేలా సాగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ధ్వజమెత్తారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్
బాధితుల్ని ఓదార్చడంలో సీఎం జగన్కు ఎవరూ సాటిరారు.. నా అక్క.. నా చెల్లి.. నా అన్న.. అంటూ ఎంతో ఆత్మీయతను పంచుతారు. -
మా ఊరిలో ఓటుకు నోటు వద్దే వద్దు
తమ గ్రామంలో ఓట్లు అమ్మకానికి లేవంటూ ఆ ఊరివారంతా ఒకే మాట మీద నిలబడి రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్నారు. -
జగన్కు ఊపిరి సలపనివ్వని కడప సిస్టర్స్
ఇలా కడప సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీతలు ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయనకు వారు పక్కలో బల్లెంలా...కాదు..కాదు...గొడ్డలిలా మారారు. ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. -
వైకాపా రాక్షస పాలనలో అందరూ బాధితులే
వైకాపా రాక్షస పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సామాన్యులు బాధితులుగా మిగిలిపోయారని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి అన్నారు. -
జీతం నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి.. సేవలు నరసరావుపేటలో వైకాపాకు!
నెల్లూరు నగరపాలకసంస్థలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను విస్మరించి వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. -
ఇళ్ల స్థలాలు చూపిస్తాం రండి
జగనన్న ఇళ్ల పట్టాల స్థలాల్ని చూపిస్తామంటూ లబ్ధిదారుల్ని వైకాపా నాయకులు మభ్యపెట్టబోగా... అది వికటించి అభాసుపాలయ్యారు. -
జగనన్న ఇచ్చే డబ్బులు నా కోసమే
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ఓటర్లకు పంచే డబ్బులు తన కోసమేనని కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
పులివెందుల సీఐ శంకర్రెడ్డితో ప్రాణహాని
వైఎస్సాఆర్ జిల్లా పులివెందుల సీఐ శంకర్రెడ్డి.. వైకాపా నేతలతో చేతులు కలిపి తనను చంపేందుకు కుట్ర పన్నారని వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. -
పల్నాడులో నాటుబాంబుల కలకలం
కొద్దిరోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నాటుబాంబులు బయటపడటం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడులో నాటుబాంబులతో పాటు, మారణాయుధాలు ఉన్నాయనే సమాచారం మేరకు ఎస్సై ఎస్.కోటయ్య సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. -
రూ.వేల కోట్ల అవినీతి చేసి బెయిల్పై తిరుగుతున్నారు
రూ.వంద కోట్ల అవినీతి చేసిన వారిని జైలులో పెడుతున్నారని, రూ.45 వేల కోట్ల అవినీతి చేసిన వారు బెయిల్పై బయట ఉంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
కామినేనిని భారీ మెజారిటీతో గెలిపించండి
కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
-
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్