ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్
బాధితుల్ని ఓదార్చడంలో సీఎం జగన్కు ఎవరూ సాటిరారు.. నా అక్క.. నా చెల్లి.. నా అన్న.. అంటూ ఎంతో ఆత్మీయతను పంచుతారు.
అన్నమయ్య ప్రాజెక్టు ఏడాదిలో కడతామంటూ హామీ
రెండున్నరేళ్లుగా తీరని బాధితుల వెతలు
నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం పర్యటన
ఈనాడు, కడప : బాధితుల్ని ఓదార్చడంలో సీఎం జగన్కు ఎవరూ సాటిరారు.. నా అక్క.. నా చెల్లి.. నా అన్న.. అంటూ ఎంతో ఆత్మీయతను పంచుతారు. తలపై చేయి పెట్టి నేనున్నానంటూ భరోసా ఇస్తారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకూ అలాంటి మాటలే చెప్పారు.. కానీ అవేమీ వాళ్ల కడుపు నింపలేకపోయాయి. కన్నీళ్లు తుడవలేకపోయాయి. వరదలు ఊళ్ల మీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లి రెండున్నరేళ్లు అయినా బాధితులు కుదురుకోలేదు. మనుపటి జీవితానికి నోచుకోలేదు. కూడు, గూడు కోసం అల్లాడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి రాజంపేటకు గురువారం ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వస్తున్నారు.
బాధితులకు జగన్ చెప్పిందేంటి? చేసిందేంటి..?
2021 నవంబరు 19న వరదల కారణంగా అన్నమయ్య జలాశయం మట్టి కట్ట కొట్టుకుపోయింది. చెయ్యేరు నది ఒడ్డునున్న రాజంపేట మండలం.. పులపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తోడూరుపేట, రామచంద్రాపురం, పాపరాజుపల్లె, శేషమాంబపురం, రాచపల్లె, గుండ్లూరు గ్రామాల్లో సర్వం ఊడ్చేసి.. గుండెకోత మిగిల్చింది. విపత్తు జరిగిన రెండు వారాలకు అంటే 2021 డిసెంబరు 2న సీఎం జగన్.. వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయిన అభాగ్యుల తలపై చేయిపెట్టి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. హామీలతో ఊరడించారు. జగనన్న మాటలు.. చివరకు నీటిమీద రాతలే అయ్యాయి. రెండున్నరేళ్లుగా నిలువనీడ కల్పించలేకపోయారు. జల విలయంతో 453 ఇళ్లు నేల మట్టం కాగా.. 601 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో సామగ్రి, పశువులు ఏమీ మిగల్లేదు. వరదల్లో కొట్టుకుపోయి 39 మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాలతో బయటపడ్డ వారు కట్టుబట్టలతో మిగిలారు. బాధితులందరికీ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఏడాదికి తాళాలిస్తామనే హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం కోసం 30.12 ఎకరాలు సేకరించి 5 చోట్ల లేఅవుట్లు వేశారు. పులపుత్తూరు, తొగూరుపేట, మందపల్లెలోని లేఅవుట్లలో 448 మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. కొండ ప్రాంతం నివాసయోగ్యం కాదంటూ 120 మంది బాధితులు పట్టాలు తీసుకోలేదు. ప్రత్యామ్నాయం చూపాలన్న విజ్ఞప్తికి దిక్కూ మొక్కూలేదు. వాటిలో ఇప్పటికి 26 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తికాగా.. మిగిలినవి వివిధ దశల్లో ఆగిపోయాయి. చాలా వరకు పునాదుల దశల్లోనే ఉన్నాయి. దీంతో చాలా మంది గుడారాల్లోనే తలదాచుకుంటున్నారు. నష్టపోయిన బాధితులకు పరిహారం అంతంత మాత్రంగానే ఇచ్చి సరిపెట్టారు.
టెండరుతోనే ఆగిపోయిన పునర్నిర్మాణం
అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి రూ.879 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేశారు. 2023-24 బడ్జెట్లో రూ.20 లక్షలు మాత్రమే కేటాయించారు. దీంతో గుత్తేదారు ముందుకు రాలేదు. ఏడాదిలో ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామన్న జగన్ హామీ రెండున్నరేళ్లు అవుతున్నా టెండరు పిలవడం, గుత్తేదారు వెనక్కి తగ్గడం వరకే పరిమితమైంది. ఫలితంగా రాజంపేట, నందలూరు, పుల్లంపేట, పెనగలూరు మండలాలు కరవుతో అలమటిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు