Craters : ఉల్కపాతంతో భారత్లో ఏర్పడ్డ మూడు బిలాలివే!
ఉల్కపాతం (meteorite) కారణంగా భారత్లో (India) మూడు చోట్ల బిలాలు ఏర్పడ్డాయి. వాటి విశేషాలు తెలుసుకోండి.
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూ గ్రహం (Earth) పుట్టుక మొదలైంది. మానవ జాతి మనుగడ మొదలైనప్పటి నుంచి కూడా ఈ గ్రహంపైకి అంతరిక్షం (Space) నుంచి రకరకాల శకలాలు వచ్చి పడ్డాయి. అందులో కొన్ని చాలా చిన్నగా ఉండేవి. మరికొన్ని పరిమాణంలో చాలా పెద్దగా ఉండటం వల్ల భూగోళాన్ని ప్రభావితం చేశాయి. సాధారణంగా గ్రహ శకలాలు భూమి దిశగా పయనిస్తున్న క్రమంలోనే కాలిబూడిదైపోతాయి. అతి తక్కువ మాత్రమే విజయవంతంగా భూమిని చేరుతాయి. అలా చేరిన వాటిలో సుమారు 190 దాకా భూమిపై పడి ఒక మచ్చలా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉల్కపాతం మూలంగా ఏర్పడిన మచ్చలు మన దేశంలోని భూభాగంపై కూడా మూడు ఉన్నాయి. వాటిని బిలాలు అని పిలుస్తున్నారు. అవి మహారాష్ట్రలోని లోనార్, మధ్యప్రదేశ్లోని ధాలా, రాజస్థాన్లోని రామ్గఢ్ బిలాలు. వీటిని ఆస్ట్రోబ్లెమ్స్ అని కూడా పిలుస్తున్నారు.
లోనార్ బిలం-మహారాష్ట్ర
భారత్లోని మూడు బిలాల్లో మహారాష్ట్రలోని లోనార్ బిలం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని 1823లో కనుగొన్నారు. తొలుత దీన్ని అగ్నిపర్వత బిలం అని శాస్త్రవేత్తలు భావించారు. తరువాత కాలంలో అనేక పరిశోధనలు చేసి ఇది ఉల్కపాతం వల్ల ఏర్పడిందని నిర్థారించారు. ఈ లోనార్ బిలం 35000-50000 ఏళ్ల క్రితం ఏర్పడి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బిలం ఓ సరస్సులా దర్శనమిస్తోంది. అది 1.8 కిలోమీటర్ల వ్యాసంతో సుమారు 500 అడుగుల లోతు ఉంది. బిలం అంచు భూమి నుంచి 65 అడుగుల ఎత్తులో కన్పిస్తుంది. మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బరువైన ఉల్కపాతం వల్ల ఈ గొయ్యి ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉల్కపాతం గంటకు 90 వేల కిలోమీటర్ల వేగంతో వచ్చి భూమిని ఢీకొట్టి ఉంటుందని అంచనా. ఈ లోనార్ బిలం మరో విశేషం ఏమిటంటే ఇందులోని నీరు ఉప్పగా, క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇది భూమిని చేరి వేల ఏళ్లు పూర్తవుతున్నా ఇందులో మాస్కెలినైట్ వంటి శకలాలు ఇప్పటికీ కన్పిస్తున్నాయని చెబుతున్నారు. అధిక వేగంతో భూమిని చేరిన సందర్భంలో మాత్రమే గాజు తరహాలో ఉండే మాస్కెలినైట్ ఏర్పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ పదార్థం లభించడం మూలంగానే లోనార్ అగ్నిపర్వత విస్ఫోటంతో ఏర్పడలేదనే నిర్థారణకు వచ్చారు.
ధాలా బిలం-మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని ధాలా బిలం వయసు సుమారు అనేక మిలియన్ సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. ఇది భారత్లోని అతి పురాతన, పెద్ద బిలం. ధాలా బిలం వ్యాసం 11 కిలోమీటర్లు ఉంటుంది. దాంతో ఇది ఆసియాలోనే అతి పెద్ద బిలంగా గుర్తింపు పొందింది. లోనార్ లాగే అధిక వేడికి గురైన కారణంగా ఇక్కడ కూడా కొన్ని వికృతమైన శిలలు ఏర్పడ్డాయి. బిలం, దాని అంచు భాగాలు ప్రస్తుతం కోతకు గురయ్యాయి. కానీ, దాని భౌగోళిక నిర్మాణం మాత్రం చెక్కుచెదర్లేదు.
రామ్గఢ్ బిలం-రాజస్థాన్
ఇటీవలి కాలంలో ఈ బిలం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. రామ్గఢ్ బిలం సుమారు 165 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రాజస్థాన్లోని కోట పట్టణం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో రామ్గఢ్ బిలం ఉంది. దీని వ్యాసం సుమారు 10 కిలోమీటర్లు. రామ్గఢ్ బిలం మధ్యలో ఒక శిఖరం ఉండటం మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం రూ.57.22 కోట్లు కేటాయించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.