ఉమెన్స్ డే స్పెషల్: టెక్ వీర నారీమణులు
గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం ఇలా ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో సీఈవోలుగా మన భారతీయులు ఉండటం చూస్తున్నాం. సుందర్ పిచ్చయ్, సత్య నాదేళ్ల శాంతను నారాయణ్, అరవింద్ కృష్ణ ఇలా చాలా మంది భారత సంతతి
గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం ఇలా ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో సీఈవోలుగా మన భారతీయులు ఉండటం చూస్తున్నాం. సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ ఇలా చాలా మంది భారత సంతతి పురుషులు ఆయా సంస్థల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అయితే.. వీరికి ఏ మాత్రం తగ్గమంటూ మన భారత మహిళలు కూడా టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా టెక్ కంపెనీల్లో తమ సత్తా చాటుతున్న కొందరు నారీమణుల గురించి తెలుసుకుందామా..
నాయకత్వ సదస్సులకు అధినేత్రి ఆమె
ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్).. ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ రంగాలతో కలిసి పనిచేసే ఓ సంస్థ. 1988లో ఏర్పడిన ఈ నాస్కామ్.. టెక్సాలజీపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తుంటుంది. అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఈ సదస్సుల్లో పాల్గొని తమ పరిధిని పెంచుకోవచ్చు.. ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. ఎదుగుతున్న కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడే ఈ సంస్థకు తొలి మహిళా ప్రెసిడెంట్గా దెబ్జానీ ఘోష్ వ్యవహరిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో పట్టా పొందిన దెబ్జానీ ఘోశ్.. ముంబయిలో ఎంబీఏ చేశారు. నాస్కామ్ ప్రెసిడెంట్గా టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలపై అవగాహన పెంచుతున్నారు. జీవన స్థితిగతులు, జీవనోపాధిని పెంచడంలో టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని దెబ్జానీ నమ్ముతారు. అందుకే ‘థింక్ డిజిటల్.. థింక్ ఇండియా’కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాదు.. ఇన్టెల్ ఇండియా, మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఏఐటీ)ని ముందుండి నడిపిస్తున్నారు.
గొప్ప పదవులు.. గొప్ప సేవలు
రోషిణి నాడార్ మల్హోత్ర.. ఫోర్బ్స్ వందమంది ప్రభావిత మహిళలో 54వ ర్యాంక్ పొందిన వ్యక్తి. హెచ్సీఎల్ కార్పొరేషన్కు సీఈవో.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. హెచ్సీఎల్ టెక్సాలజీస్ వైస్ ఛైర్పర్సన్ కూడా. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మెనేజ్మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా పొందిన రోషిణి.. హెచ్సీఎల్లో అడుగుపెట్టక ముందు యూకేలోని స్కై న్యూస్లో న్యూస్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. శివ్ నాడర్ ఫౌండేషన్కు ట్రస్టీగా ఉంటూ.. సొంతగా ‘ది హబిటెట్స్’ అనే ట్రస్ట్ను ఏర్పాటు చేశారు.
ది హబిటెట్స్ ట్రస్ట్ ద్వారా రోషిణి ప్రకృతిలోని జీవాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. యంగ్ గ్లోబల్ లీడర్స్ కార్యక్రమం ద్వారా యువతను ముందు తరం నాయకులుగా తీర్చుదిద్దుతున్నారు. ది వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్.. రోషిణి కృషికి గుర్తింపుగా ‘ది వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ పీపుల్ అవార్డ్తో సత్కరించింది.
ఐటీ రంగంలో ఆమెది పరిచయం అక్కర్లేని పేరు
హెచ్సీఎల్.. ఐబీఎం.. మైక్రోసాఫ్ట్.. హెచ్పీ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల్లో 35 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి నీలం ధావన్. 11 ఏళ్లపాటు మైక్రోసాఫ్ట్ ఇండియాకు ఎండీగా ఉన్నారు. ఆ తర్వాత హెచ్పీ ఇండియాలో పని చేశారు. ఐటీ రంగంలో నీలం ధావన్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె నాయకత్వంలోనే హెచ్పీ సంస్థ గేమింగ్ ల్యాప్టాప్ ‘ఓమెన్’ను విడుదల చేసింది.
దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్ నుంచి ఎకానమిక్స్లో డిగ్రీ, దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన నీలం.. నెదార్లాండ్స్కు చెందిన గ్లోబర్ సుపర్వైజరీ బోర్డ్ ఆఫ్ రాయల్ ఫిలిప్స్లో సభ్యురాలిగా ఉన్నారు. ఆరోగ్య రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై ఆమె కృషి చేస్తున్నారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి మ్యాగజైన్లు నీలంను వ్యాపారరంగంలో శక్తిమంతమైన మహిళగా గుర్తించాయి.
పేపాల్లో కీలక విధులు ఆమెవే!
టెక్ రంగంలో దీపా మాధవన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు దశాబ్దాలుగా ఆమె ఐటీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు ఎకనామిక్స్లో డిగ్రీ.. కంప్యూటర్సైన్స్లో పీజీ చేసిన దీప.. ప్రస్తుతం ప్రముఖ మొబైల్ వాలెట్ ‘పేపాల్’లో గ్లోబల్ డేటా గవర్నెన్స్, రెగ్యులేటరి ఆర్గనైజేషన్ అండ్ డేటా ఫంక్షన్ విభాగం డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దీంతోపాటు పేపాల్ డేటా ప్రైవసీలో టెక్నాలజీ సొల్యూషన్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. పేపాల్లో చేరకముందు దీపా.. డెలైట్, పెన్వెల్ కార్ప్, ఆప్టిమల్ టెక్నాలజీస్ కంపెనీల్లో పనిచేశారు.
ఐటీలో మకుటం లేని ‘వనిత’
వనితా నారాయణన్కు ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంతో ఎంతో కాలంగా అనుబంధం ఉంది. ఆ సంస్థలోనే ఆవిడ ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. 2017-18 కాలంలో వనిత ఐబీఎం ఇండియా ఛైర్పర్సన్గా వ్యవహరించారు. అంతకుముందు ఐబీఎం ఇండియా ఎండీగా.. ఇండియా, సౌత్ ఏషియా రీజినల్ మేనేజర్గా పనిచేశారు. ఆమె నాయకత్వంలో ఐబీఎం ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసింది. 30 ఏళ్ల అనుభవం గల వనిత.. ఇండియాలో ఐబీఎం విస్తరణకు ఎంతగానో కృషి చేశారు.
2012లో వనిత ఐబీఎం ఇండస్ట్రీ అకాడమీలో చేరారు. ఈ అకాడమీని సంస్థ ఆలోచనలను, బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీ అకాడమీ బోర్డ్ సభ్యురాలిగా ఉన్నారు. ఐబీఎం గ్లోబల్ వుమెన్స్ కౌన్సిల్లోనూ ఆమెకు సభ్యత్వం ఉంది. అసోచామ్ ఇండియాకు ఛైర్పర్సన్గానూ వ్యవహరించారు. ప్రస్తుతం సంస్థ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగుతున్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ల బోర్డు ఆఫ్ గవర్నర్స్కు ఛైర్పర్సన్గా వనితను రాష్ట్రపతి నియమించారు. మూడేళ్లపాటు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. సీఎక్స్ఓ టుడే ప్రకటించిన 12 గ్లోబల్ ఇండియన్ వుమెన్ ఆఫ్ 2016లో వనితకు చోటు దక్కింది. ఆమెను ‘మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ ఇన్ ఇండియా’గా 2016లో బిజినెస్ టుడే మ్యాగజైన్ అభివర్ణించింది. మద్రాస్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్లో ఎంబీఏ చేసిన వనితా నారాయణన్ ఆ తర్వాత హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!