ప్రపంచానికి భారత్ సంజీవనిగా ఎలా మారింది?
ప్రపంచదేశాలకు భారత్ ఇప్పుడొక సంజీవని పర్వతంలా కనిపిస్తోంది. ఎందుకంటారా? ప్రస్తుతం కరోనా(కొవిడ్-19)వైరస్ సోకిన బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్నే ఔషధంగా ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా దేశాలు భారత్ సాయం కోరుతున్నాయి. ‘‘చేసిన సాయాన్ని
ప్రపంచదేశాలకు భారత్ ఇప్పుడొక సంజీవని పర్వతంలా కనిపిస్తోంది. ఎందుకంటారా? ప్రస్తుతం కరోనా(కొవిడ్-19)వైరస్ సోకిన బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్నే ఔషధంగా ఇస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో ఇది అధికంగా లభిస్తుండటంతో చాలా దేశాలు మన సాయం కోరుతున్నాయి. ‘‘చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటాం’’, ‘‘సరైన సమయంలో ఆదుకున్నారు మోదీజీ’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో చేసిన వ్యాఖ్యలు భారత్ ప్రతిష్ఠను మరింత పెంచాయి. ఈ రెండు దేశాలే కాదు.. దాదాపు 30దేశాలు హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేయాలని భారత్ను అభ్యర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హైడ్రాక్సీక్లోరోక్విన్ భారత్లోనే అత్యధికంగా ఎందుకు తయారవుతోంది? ఇతర దేశాలు ఎందుకు భారత్ సాయం అడుగుతున్నాయి? చూద్దాం..
భారత్లోనే ఎందుకు అధిక ఉత్పత్తి?
హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది మలేరియా జ్వరాన్ని నయం చేసే ఔషధం. కీళ్ల వాతం, లూపస్ వంటి సమస్యలను కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ నయం చేస్తుంది. మన దేశంలో మలేరియా జ్వరాలు తరచూ వస్తుంటాయి. కీళ్లవాతానికి హైడ్రాక్సీక్లోరోక్వినే ఔషధం కావడంతో బాధితులు పెద్దమొత్తంలో వీటిని వాడుతున్నారు. దీన్ని దేశంలో జిడస్ కాడిలా అండ్ వాలేస్ ఫార్మాస్యూటికల్స్, ఐపీసీఎ ల్యాబొరేటరీస్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్ ప్రతి నెలా 60-70 మెట్రిక్ టన్నుల హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఉత్పత్తి చేస్తుంటుంది. సాధారణ రోజుల్లో భారత్ 3 మిలియన్ హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్ వినియోగించుకోగా.. 30 మిలియన్ల టాబ్లెట్స్ను ఎగుమతి చేస్తుంటుంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా భారత్ నుంచే 70శాతం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం సరఫరా అవుతోందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ చెబుతోంది.
కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్వినే ఎందుకు?
ప్రపంచదేశాలతో పాటు మన దేశానికీ కరోనా వ్యాప్తించింది. దీనిని నయం చేసే వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కరోనాపై హైడ్రాక్సీక్లోరోక్విన్ సమర్థంగా పనిచేస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. అయితే కరోనా పాజిటివ్ ఉన్న రోగులకు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ఈ ఔషధాన్ని వాడాలని సూచించింది. ఇది వంద శాతం కరోనాను నయం చేస్తుందనే హామీ లేకపోయినా సమర్థంగా కరోనా వైరస్ను ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ ఔషధాన్ని కరోనా కేసుల్లో వినియోగించడం మొదలుపెట్టారు. ఫలితం బాగుండటంతో హైడ్రాక్సీక్లోరోక్విన్కు డిమాండ్ పెరిగింది. మన దేశ అవసరాల దృష్ట్యా ఈ ఔషధాన్ని ఇతర దేశాలకు ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం తొలుత నిషేధం విధించింది. అమెరికా విజ్ఞప్తి అనంతరం ఎగుమతులకు అనుమతించింది.
ఇతర దేశాలు మనల్నే ఎందుకు అడుగుతున్నాయి?
చాలా దేశాల్లో మలేరియా జ్వరం అనేది లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా లేకపోవడంతో పూర్తిగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇతర దేశాలు, భారత్ సరఫరా చేస్తుండటంతో సొంతంగా ఔషధాన్ని తయారు చేసుకోవడం మానేశాయి. కరోనా నేపథ్యంలో ఎగుమతులను భారత్ నిషేధించడంతో హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా ఆయా దేశాలకు నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔషధం పంపాలని కోరగా.. తొలుత నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత సాయం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తాజాగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని అమెరికాకు పంపించింది. అలాగే బ్రెజిల్కూ సాయం చేయడంతో ఆ దేశాధ్యక్షుడు భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నాయి.
వాళ్లకిస్తే.. మరి మనకు?
హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నా.. మన దేశంలో సరిపడా ఔషధ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం దేశానికి కావాల్సిన దానికంటే మూడురెట్లు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ నెలలో 3.28 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు అవసరమవుతాయని చెప్పింది. ప్రస్తుతం మన దేశీయ అవసరాలు తీర్చుకోగా.. 25కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం సూచించగా.. కంపెనీలు సైతం దేశీయ అవసరాలకు, ఎగుమతులకు సరిపడా ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం