Flies : ఈగలు మనుషులపై ఎందుకు వాలుతాయి.. ఏం తింటాయంటే!
ఇంటి (House) పరిసరాల్లో కాస్త అపరిశుభ్రత ఉన్నా ఈగలు (Flies) స్వైర విహారం చేస్తుంటాయి. ఆహారం (Food), మనుషులపై (Humans) వాలుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. అసలు ఈగల వ్యాప్తికి కారణాలేంటో తెలుసుకోండి.
కొందరి ఇళ్లలో ఈగలు (Flies) నిత్యం మోత మోగిస్తుంటాయి. మధ్యాహ్నం పూట వాటి విజృంభణ మరింత ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంపై (Food)వాలడమే కాకుండా మన చుట్టూ తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా పల్లెటూళ్లలో వ్యవసాయ భూములు, ఎరువు దిబ్బలకు సమీపంలో ఉండే ఇళ్లలో ఈగల సంచారం అధికంగా కన్పిస్తుంది. అసలు ఇళ్లలోకి ఈగలు ఎందుకొస్తాయి? అవి మనుషుల చుట్టూ తిరగడానికి గల కారణం ఏంటి? వాటిని ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకోండి.
వెచ్చదనం కోసం..
మన ఇళ్లలో కనిపించే ఈగలు కేవలం 15 నుంచి 25 రోజులు మాత్రమే జీవిస్తాయి. అవి పగటిపూట ఎక్కువగా సంచరిస్తూ.. నేల, గోడ, సీలింగ్ ఫ్యాన్, కిటికీల వంటి వాటిని ఆవాసంగా చేసుకుంటాయి. కిటీకీల దగ్గర వాటికి కావాల్సినంత వెచ్చదనం లభిస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండటానికి ఇష్టపడతాయి. ఈగలు కూడా నిద్రపోతాయి. అవి నేల, మొక్కలు, కంచె తీగలు, చెత్తడబ్బాలను తమ నిద్ర కోసం ఎంచుకుంటాయి. వాటికి వాతావరణం మరీ చల్లగా ఉన్నా.. మరీ వేడిగా ఉన్నా నచ్చదు. అందుకే ఎప్పుడూ ఒక స్థిరమైన ఉష్ణోగ్రత కోసం పాకులాడుతుంటాయి. అంటార్కిటికాలో మరీ చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ ఈగలు దాదాపుగా కనిపించవు.
వాసన పసిగట్టి..
ఈగలన్నీ మురికిని ఎక్కువగా ఇష్టపడతాయి. చెత్త, మలం, పేడ, కుళ్లిన ఆహారం, కళేబరాలపై వాలి తింటాయి. మనుషుల నివాసాలకు దగ్గర్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టే ఈగలు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఈగలకు తీపి పదార్థాలన్నా ఇష్టమే. బెల్లం వంటి పదార్థాల వాసన పసిగట్టి వెంటనే అక్కడ వాలిపోతుంటాయి.
మనుషుల శరీరంపై ఆహారం
మనుషుల చర్మంపై కొంత నూనె, ఉప్పు, మృత కణాలుంటాయి. ఈగలు కేవలం ఇళ్లలో కనిపించే ఆహారం మాత్రమే తినవు. మానవ శరీరంపై ఉండే.. కంటికి కనిపించని వ్యర్థాలు కూడా వాటికి ఆహారమే. అందుకే వాలుతుంటాయి. ఆ సమయంలో మనం చిరాకుతో వాటిని చంపడానికి యత్నించినా సులభంగా తప్పించుకుంటాయి. వాటి తీక్షణమైన కళ్లతో ప్రమాదాన్ని ముందే పసిగట్టి 100 మిల్లీ సెకండ్లలోనే ఎగిరిపోతాయి. ఈగలు ఎక్కడ వాలినా కళ్లతో ఆ పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటాయి. మనుషులు తమకు ప్రమాదాన్ని కలుగజేస్తారని అవి భావించవు. ఎందుకంటే వాటి ఆహారమే మనుషులపై ఉంటుంది కాబట్టి.
100కు పైగా వ్యాధులు
వ్యాధులను వ్యాపింపజేయడంలో ఈగల పాత్ర కీలకం. ఒక ఈగ మనం తినే పదార్థాలపై వాలిందంటే దానిలో 100కు పైగా వ్యాధి కారకాలు చేరినట్లే లెక్క. అంతే కాకుండా అవి గుడ్లు పెట్టినా, మల విసర్జన చేసినా వ్యాధులు వ్యాపిస్తాయి. ఈగలు ఏదైనా ఆహారం తింటే దాన్ని మళ్లీ బయటకు రప్పిస్తాయి. ద్రవరూపంలోకి మార్చుకుని తిరిగి కడుపులోనికి పంపించుకుంటాయి. ఆహార పదార్థాలపై లేదా మన శరీరంపై వాలినపుడు కూడా అవి ఇలానే చేసే అవకాశం ఉంది.
ఎలా వదిలించుకోవాలంటే..
- కిచెన్ పరిసరాలను, అందులోని డస్ట్బిన్ను తరచూ శుభ్రం చేయాలి.
- ఆహార పదార్థాలు, శీతలపానీయాలను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.
- ఎక్కడైనా ఆహారం కింద పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలి.
- సింక్లో పాత్రలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి.
- దెబ్బతిన్న పండ్లు, కూరగాయలను ఇంట్లో రోజుల తరబడి ఉంచకుండా పడేయాలి.
- తలుపులు, కిటికీలు మూసినా ఈగలు వస్తున్నాయంటే మరెక్కడైనా రంధ్రాలున్నాయేమో గమనించి వాటిని పూడ్చాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM