ఒంటి పూట..కనిపెట్టాలి ఓ కంట!
ఒక్క పూట బడులంటే పిల్లలకు భలే సరదా... చిందులు, సరదాలు.. ఉరకలేసే సమయమిది... ఆనందంతో పాటు జాగ్రత్తలు అవసరం సుమా! వేసవిలో ఒంటి పూట బడులు ఎంత సరదాను తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తతో ఉంటే అంతకుమించి రెట్టింపు ప్రమాదాలు జరుగుతాయి.
ఒక్క పూట బడులంటే పిల్లలకు భలే సరదా... చిందులు, సరదాలు.. ఉరకలేసే సమయమిది... ఆనందంతో పాటు జాగ్రత్తలు అవసరం సుమా! వేసవిలో ఒంటి పూట బడులు ఎంత సరదాను తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తతో ఉంటే అంతకుమించి రెట్టింపు ప్రమాదాలు జరుగుతాయి.. అలవాట్లు., ఆహారం, ఆరోగ్యం, చదువు.. తదితర అంశాలను ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే ప్రయోజనం.. నేటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒంటి పూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనమిది..
న్యూస్టుడే, డోర్నకల్, భూపాలపల్లి: అప్రమత్తతే కీలకం: ఉదయం ఉరుకులు, పరుగులతో బడికి వెళ్లాలి. మిట్ట మధ్యాహ్నం ఇళ్లకు చేరుకోవాలి. ఇప్పటికే నెత్తిన సూర్యుడు సుర్రుమంటున్నాడు.. సాయంత్రం వేళ ఆటలప్పుడు అప్రమత్తత కీలకం.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ముప్పు పొంచి ఉందని గ్రహించాలి. అనుక్షణం జాగ్రత్తలు తీసుకుంటే ఒక పూట బడుల ప్రక్రియ విజయవంతం అవుతుంది..
మధ్యాహ్నం వేళ
- బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ పిల్లలను ఆటలాడుకోవడం కోసం బయటకు వెళ్లనీయవద్దు..
- మధ్యాహ్నం భోజనం చేశాక గంట తర్వాత పాలు, టెంకాయ నీరు, పండ్ల రసాలు వంటి ధ్రవపదార్థాలు ఇవ్వాలి..
- కాచి చల్లార్చిన లేదా శుద్ధ జలం ఇవ్వాలి.. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునేలా చూడాలి
- పిల్లలు తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ బారిన పడకుండా చూడాలి..
ఆహారం.. అలవాటు
- పెందలాడే బడికి వెళ్లాలంటే తొందరగా నిద్రలేవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఇడ్లీ అయితే భేష్. పండ్లయినా ఫర్వాలేదు.
- అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో కూరగాయలకే ప్రాధాన్యమివ్వాలి.
- మాంసాహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం..
- బడిలో ఉండే సమయంలో అప్పుడప్పుడు ద్రవ పదార్థాలు, పానీయాలు, నీరు తీసుకునేలా ఉపాధ్యాయులకు సూచిస్తే బాగుంటుంది.
- చదువుకు ప్రణాళిక ఉండాలి
- ఒంటి పూట బడులని చదువులకు దూరం కావద్దు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకుంటే మేలు.
- ఆటలాడుకునే సమయం పోను మిగతాది చదువుకు కేటాయించాలి..
- రాత్రి వేళ త్వరగా పడుకుంటే ఉదయం నిద్ర లేవడంలో ఇబ్బందులుండవు..
ఇలా చేయండి
- పిల్లలు తెలుపు రంగు కాటన్ దుస్తులు వేసుకునేలా చూడాలి..
- పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు నెత్తిన ఛత్రం లేదా టోపీ లేదా దస్తీ చుట్టాలి..
- ఇంటికి వచ్చాక భోజనం చేయడానికి ముందు, అలాగే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునేలా పిల్లలకు తర్ఫీదునివ్వాలి..
- బయట విక్రయించే పదార్ధాలు తినకుండా చూడాలి..
- అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించే శీతల పానీయాలు తాగొద్దని చెప్పాలి..
ఈత.. జర జాగ్రత్త
- ఒంటి పూట బడి.. వేసవి తాపం నేపథ్యంలో పిల్లలు ఏదో ఒక వంకతో నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. తల్లిదండ్రుల కళ్లుగప్పి వెళ్తారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా పిల్లలను కనిపెడుతుండాలి.
- పట్టణాలు, పల్లెల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో పెద్దగా నీళ్లు లేవు. నీళ్లు ఎక్కడున్నాయే అడ్రస్ పిల్లలకు ఇట్టే తెలుస్తుంది.. అధికారులు కూడా ఆయా ప్రదేశాల్లో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి.
- శిక్షకుడి పర్యవేక్షణలో ఈత నేర్చుకుంటే పర్వాలేదు..
- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఈతకు వెళ్లకపోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. -
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. -
సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపొద్దు: ఈసీ
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు ఖండించారు. -
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
పోలింగ్ రోజున కడప గౌస్నగర్లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
ఏపీలో పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. -
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. -
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూవివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, భారాస నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు