శిరోముండనం కేసు.. వైకాపా ఎమ్మెల్సీకి జైలు శిక్ష
సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది.
విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
కావేరి నదిలో ఈతకు దిగిన విద్యార్థులు ఐదుగురు మృత్యువాతపడిన ఘటన కర్ణాటకలో విషాదం రేపింది. -
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM