covid19: కాలేజ్ ఈవెంట్.. 66 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్..!
కొవిడ్ మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్లోని ఒక మెడికల్ కళాశాలలో 66 మంది వైద్య విద్యవిద్యార్థులకు కరోనా సోకింది.
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్లోని ఒక మెడికల్ కళాశాలలో 66 మంది వైద్యవిద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా కరోనా టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం విశేషం. ఈ విషయాన్ని నేడు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోని ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్గా తేలింది. విద్యార్థులు ఇటీవలే ఒక కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
సమాచారం తెలుసుకొన్న అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. ఇప్పటికే విద్యార్థులు అంతా టీకాలు తీసుకోవడంతో వారిని క్వారెంటైన్లో ఉంచినట్లు ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితేష్ పాటిల్ తెలిపారు. ‘‘మిగిలిన 100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. రెండు హాస్టళ్లను సీల్ చేశాము. విద్యార్థులకు అవసరమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నాము. ఎవరినీ అడుగు బయటపెట్టనీయడంలేదు. ఇప్పటికీ పరీక్షలు చేయించుకోని విద్యార్థులను వేరే చోట క్వారెంటైన్లో ఉంచాము. కళాశాలలో ఇటీవల ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరినీ పరీక్షించాము. మేము వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించేపనిలో ఉన్నాము’’ అని పాటిల్ పేర్కొన్నారు.
ఒడిశా వైద్య కళాశాలలో 54 మందికి పాజిటివ్..
ఒడిశాలోని విమ్సార్కు చెందిన వైద్య కళాశాలలో కరోనా సోకిన విద్యార్థుల సంఖ్య 54కు చేరింది. వైరస్ బారినపడిన విద్యార్థులు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలకు ఇటీవల కళాశాలల్లో నిర్వహంచిన కార్యక్రమాలే కారణంగా అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.