Swati Maliwal: రాజ్యసభకు స్వాతి మాలీవాల్.. నామినేట్ చేసిన ఆప్
Swati Maliwal: దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలీవాల్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమెను ఎగువ సభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)తో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ (Rajya Saha) స్థానాలకు జనవరి 19న ఎన్నికలు (Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నామినేట్ చేసింది. ఇందులో ఒకరు దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal). ఆమెను తమ అభ్యర్థిగా నామినేట్ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ శుక్రవారం వెల్లడించింది.
దిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, నారాయణ్ దాస్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది. దీంతో వీటికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాను వరుసగా రెండోసారి నామినేట్ చేస్తున్నట్లు ఆప్ తెలిపింది.
లోక్సభ ఎన్నికలు.. 7 నుంచి ఈసీ రాష్ట్రాల పర్యటన
ఇక, సుశీల్ కుమార్ గుప్తా.. ఈ ఏడాది చివర్లో జరగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో స్వాతి మాలివాల్ను పార్టీ ఎంపిక చేసింది. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సంజయ్ సింగ్ నామినేషన్కు కోర్టు ఓకే..
సంజయ్ సింగ్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాను రెండోసారి రాజ్యసభకు వెళ్లేందుకు వీలుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీనామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకు తనను అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది.
ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ జనవరి 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. 9వ తేదీలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్లో పూర్తి నిడివి సినిమాలు
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (ట్విటర్) మరో సంచలనానికి సిద్ధమైంది. ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించనుంది. ఎక్స్ చందాదారులు సినిమాలు, టీవీ సీరియళ్లను పోస్ట్ చేయొచ్చని, వాటిని మానెటైజ్ చేయటం ద్వారా డబ్బు సంపాదించొచ్చని ఇలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు మరి. -
మద్రాస్ ఐఐటీలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లో మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్, రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా సోమవారం ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. -
మైక్రోసాఫ్ట్ ఏఐ ల్యాప్టాప్లు
సరికొత్త సర్ఫేస్ ప్రో, సర్పేస్ ల్యాప్టాప్ల పరిచయంతో మైక్రోసాఫ్ట్ సంస్థ పీసీ రంగంలో నవశకానికి నాంది పలికింది. కోపైలట్+, ఏఐతో అనుసంధానమైన తొలి పరికరాలు ఇవే. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ శ్రేణి ప్రాసెసర్లతో కూడిన వీటిపై నేరుగా కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వాడుకోవచ్చు. -
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు
ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ప్రశ్నించారు. -
‘డీప్ఫేక్’ ఫొటోలను గుర్తించండిలా..
సాంకేతికత అనే కత్తికి రెండువైపులా పదునే. మనం ఎలా వినియోగించుకున్నామనే దానిపైనే మంచీ చెడూ ఆధారపడి ఉంటాయి. ఈ సాంకేతిక యుగంలో మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో కృత్రిమ మేధ ఒకటి. అయితే, నాణేనికి మరోవైపులా అది అంతే ప్రమాదకరమైంది కూడా..! -
సిసోదియాకు బెయిల్ నిరాకరణ
ఆప్ నేత, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, ఆయనకు బెయిల్ మంజూరు చేయలేమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
అధికరణం 370 రద్దును సమర్థించిన సుప్రీం తీర్పు సమీక్షకు నిరాకరణ
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించిన గత ఏడాది డిసెంబరు 11 నాటి సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. -
తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్ కోర్టు తీర్పు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్లోని ఇందౌర్ కోర్టు స్పష్టం చేసింది. వయోధికురాలైన మాతృమూర్తికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పు వెలువరించారు. -
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు మూసివేత
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం మూసేసింది. గత ఏడాది ఏప్రిల్ 6న జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంస్థను మూసేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. -
సంకట్ మోచన్ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ, యోగి
ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి వారణాసిలోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. -
మధ్యంతర బెయిల్ ఎందుకివ్వాలి?
ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్కు మధ్యంతర బెయిల్ మంజూరు విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. -
దుబాయ్ విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షుల మృతి
దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం (ఈకే 508) ముంబయి ఎయిర్పోర్టులో కిందికి దిగుతున్న సమయంలో ఫ్లెమింగో పక్షుల గుంపును ఢీకొనడంతో దాదాపు 40 పక్షులు మృతిచెందాయి. -
భారత్లోనూ కొత్తగా కొవిడ్ కేసుల నమోదు
ఇప్పటికే సింగపూర్ను కుదిపేస్తున్న కేపీ.1, కేపీ.2 వేరియంట్లు.. తాజాగా మన దేశానికీ విస్తరించాయి. భారత్లో కేపీ.2 వేరియంట్ కేసులు 290, కేపీ.1 వేరియంట్ కేసులు 34 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
సీబీఐలో లంచాధికారులు!
కంచే చేను మేసిన చందంగా.. ఓ కుంభకోణం కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులే అవినీతికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
మధ్యప్రదేశ్లో బయటపడిన నర్సింగ్ కాలేజీ స్కామ్కు సంబంధించి దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులే అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది. -
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని భాజపా సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. -
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
ఛత్తీస్గఢ్లోని ఓ లోయలో పడిన వాహన ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలానని ఆవేదన వ్యక్తంచేశాడు.