snowfall: హిమపాతంలో చిక్కుకున్న యాత్రికులు.. 400 మందిని రక్షించిన ఆర్మీ
అస్సాం (Assam)లో సంభవించిన హిమపాతం (Snowfall) లో చిక్కుకున్న 400 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. ఆపరేషన్ హిమ్రహత్ పేరుతో సహాయక చర్యలు చేపట్టింది.
గువాహటి: హిమపాతం (snowfall) లో చిక్కుకున్న దాదాపు 400 మంది యాత్రికులను భారత సైన్యం (Indian Army) కాపాడింది. వారికి అవసరమైన వసతి, వైద్యసేవలు అందించి, భోజనసౌకర్యాలు కల్పించినట్లు రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. శనివారం సాయంత్రం దాదాపు 100 వాహనాల్లో 400 మంది ప్రయాణికులు సిక్కింలోని నాతులా, సొంగో సరస్సును సందర్శించి తిరిగి వస్తుండగా.. ఒక్కసారిగా హిమపాతం సంభవించింది. దీంతో పర్యాటకులందరూ మంచులో చిక్కుకుపోయినట్లు ఆర్మీ వెల్లడించింది. బాధితుల్లో 142 మంది మహిళలతోపాటు 50 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న త్రిశక్తి దళానికి చెందిన సైనికులు స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా ‘ఆపరేషన్ హిమ్రహత్’ పేరుతో సహాయక చర్యలు చేపట్టారు. శనివారం రాత్రివరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగినట్లు ఆర్మీ వెల్లడించింది. అనంతరం ఆదివారం ఉదయం రహదారిపై పేరుకుపోయిన మంచును ఆర్మీ జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్ సాయంతో బుల్డోజర్లతో తొలగించారు. అనంతరం పర్యాటకులు గ్యాంగ్టక్కు పయనమైనట్లు లెఫ్టినెంట్ కల్నల్ రావత్ ఆదివారం మీడియాకు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు